Bigg Boss Nonstop: బిగ్ బాస్ నాన్ స్టాప్... మొదటి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరు?
Bigg Boss OTT : తెలుగు బుల్లితెరపై ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని బిగ్గెస్ట్ రియాలిటీ షోగా నిలిచింది ” బిగ్ బాస్ “. తక్కువ సమయంలోనే విశేషమైన రెస్పాన్స్ను దక్కించుకుని సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది ఈ షో. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తిన్ చేసుకోని త్వరలోనే కొత్త సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్తో నిర్వహకులు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు.
ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. దీనికి కూడా అక్కినేని నాగార్జునే హోస్టుగా చేయబోతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్తో హిందీలో గత ఏడాది ప్రసారం చేశారు. అక్కడ ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీన్ని బిగ్ బాస్ సీజన్ మాదిరిగా టీవీలో ప్రసారం చేయరు. కేవలం ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లోనే ప్రసారం చేస్తారు.
అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి నెల నుంచి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ప్రారంభం కాబోతుంది అని అంటున్నారు. ఇది మొత్తం 82 రోజుల పాటు సాగనుందని తెలుస్తోంది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ అయిందని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఓటీటీలోకి సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇప్పటికే ఆమె అగ్రిమెంట్పై సైన్ కూడా చేసిందట. బుల్లితెరపై చాలా కాలంగా వరుస సీరియళ్లతో నవ్య స్వామి సందడి చేస్తోంది. ఇక, ఇప్పుడు జీ తెలుగులో ‘సూపర్ క్వీన్’, ఈటీవీలో ‘ఢీ 14′ షోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వహకులు ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. దీనికి టెంప్ట్ అయిన నవ్య స్వామి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దీంతో ఆమె ఓటీటీ కంటెస్టెంట్గా రాబోతుందని అంటున్నారు. దీంతో ఆమె అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…