Featured

Undavalli Arun Kumar : నాశనమై పోతున్నాం మీ వైఖరీ మార్చుకోండి…ఏపీ సర్కారు పై ఉండవల్లి కీలక వాఖ్యలు….!

Undavalli Arun Kumar : అత్యంత హేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగి ఏళ్ళు గడుస్తున్నా ఏపీ కి రావాల్సిన ఆస్తులు, నిధుల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. రాజధాని సరిగా లేక ఆస్తులు లేక ఏపీ నాశనమై పోతుంటే ఒకవైపు ప్రభుత్వం కేంద్రంతో పోరాడి ఏపీకి రావలసిన వాటాల విషయంలో కూడా వెనకడుగు వేస్తోంది. ఇక విభజన హామీల అమలు కోసం పోరాడుతాం, ప్రత్యేక హోదాను కేంద్రం మెడలు వంచి సాధిస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇపుడవన్నీ తూచ్ అన్నట్లుగా ఏకంగా సుప్రీం కోర్ట్ లో విభజన విషయం ఇక వదిలేయండని అఫిడవిట్ దాఖలు చేయడం పట్ల ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పందించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర ప్రయోజనాల కోసమా పోరాడితే బాగుంటుందంటూ మాట్లాడారు.

స్వప్రయోజనాల కోసం రాష్ట్రం ను అన్యాయం చేయకండి….

ఉండవల్లి గారు మాట్లాడుతూ విభజన కేసులో కేంద్రం ఇప్పటివరకు సుప్రీం కోర్ట్ లో కౌంటర్ దాఖలు చేయలేదంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మనకు జరిగిన నష్టాన్ని అఫిడవిట్ గా చేసి సుప్రీం కోర్ట్ లో సబ్మిట్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా కేంద్రంలో ఉన్నవారితో స్నేహం ఉన్న కారణంగా పట్టించుకోకపోతే మనకు రావాల్సిన హక్కులను కోల్పోతాం అంటూ చెప్పారు. తెలంగాణ నుండి మనకు రావాల్సిన ఆస్తులు ఇప్పటికీ రాలేదు. ఊరికే ఇచ్చేస్తారా కొట్లాడాలి, పోరాడాలి అప్పుడే సాధించుకుంటాం.పోరాటం చేసాడు చేస్తాడనే నమ్మకం తోనే జగన్ ను జనాలు సీఎం ను చేసారు. ఇప్పుడు పోరాడకుండా మిగిలిపోతే రాజకీయా భవిష్యత్ ఉండదు నీకు జగన్ అంటూ అభిప్రాయపడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్. 2012, జనవరి 30న ఏం జరిగిందో తన వద్ద పూర్తి సమాచారం ఉందంటూ అరుణ్ కుమార్ తెలిపారు.

రాజ్యాంగంలోని 100వ ఆర్టికల్ ను పట్టించుకోకుండా ఆనాడు స్వార్థ ప్రయోజనక కోసం రాష్ట్ర విభజనచేసారంటూ చెప్పారు. ఇంత కాలం అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజన గురించి సుప్రీం కోర్టులో మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. కేసు విచారించాలా లేదా అనే అంశం మీద ముందుగా ప్రభుత్వం కౌంటర్ వేయాలని కోర్ట్ తెలిపిందంటూ ఉండవల్లి వివరించారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం వదిలేయమంటూ అఫిడవిట్ వేయటం పైన అసహనం వ్యక్తం చేసారు.

Bhargavi

Recent Posts

తులసి మాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి?

హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…

4 hours ago

గూగుల్ AI హబ్ తర్వాత సింహాచలం దర్శనం… సీఎం, కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…

4 hours ago

ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్!

ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…

4 hours ago

సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణం… ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…

4 hours ago

వేసవిలో ఆసిడిటీ, గ్యాస్ బాధ పెరుగుతోందా? జీర్ణ సమస్యలు దూరం చేసే డైట్ చిట్కాలు!

వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…

4 hours ago

వాస్తు ప్రకారం పూజా గది తప్పు దిశలో ఉంటే ఏం జరుగుతుంది?

ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…

4 hours ago