Villain Ponnambalam : ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తానన్న చిరంజీవి గారు… రామ్ చరణ్ భార్యని అంటూ ఫోన్ చేసింది… ఆ రోజు ఏం జరిగిందంటే…: విలన్ పొన్నాంబలం

Villain Ponnambalam: విలన్ గా, స్టంట్ మాస్టర్ గా వందల సినిమాల్లో నటించిన నటుడు పొన్నాంబలం. తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన పొన్నాంబలం తెలుగులో ఘరానా మొగుడు, హిట్లర్, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, చూసొద్దాం రండి, నువ్వొస్తావని వంటి సినిమాల్లో విలన్ గా నటించారు. ఎన్నో సినిమాల్లో నటిస్తూనే అటు రాజకీయాల్లోను క్రియాశీలకంగా ఉన్న పొన్నాంబలం ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చిన్న గదిలో ఉండేవారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి ప్రస్తుతం పలు సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.

చిరంజీవి రూపంలో దేవుడు కనిపించాడు…

సొంతవాళ్లే స్లో పాయిజన్ ఇవ్వడంతో అనారోగ్యం పాలైన పొన్నాంబలం గారు ఆర్థికంగానూ చితికిపోయారు. గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయనకు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారట. ఇక తన కిడ్ని పాడై పోయి డైయాలసిస్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేయడంతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ట్రీట్మెంట్ కి అయ్యే డబ్బు తనతో లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో చిరంజీవి గారికి విషయం తెలిసి ఆయన ఫోన్ చేసి విషయం అడిగి ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తా అని చెప్పారట.

ఆ పైన మెగాస్టార్ కోడలు ఉపాసన ఫోన్ చేసి స్వయంగా ఆమె మాట్లాడి అపోలో హాస్పిటల్ కి రమ్మని చెప్పారట. అక్కడికి వెళ్ళాక డైయాలసిస్ చేస్తారని అనుకున్నారట పొన్నాంబలం. అయితే కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ఆయనకు టెస్టులు నిర్వహించారట. ఉపాసన గారు ఫోన్లో మాట్లాడినపుడు నేను రామ్ చరణ్ భార్యను మావయ్య మీ గురించి చెప్పారు అంటూ చెప్పగానే షాక్ అయ్యాను. అంత పెద్ధ కుటుంబం నాకోసం కాల్ చేసారా అనిపించింది. నేడు చిరంజీవి గారి వల్లే బ్రతికి ఉన్నాను అంటూ పొన్నాంబలం ఎమోషనల్ అయ్యారు.