Writer & Director Dasarath : సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటరటైనర్స్ ను అందించిన డైరెక్టర్ అలాగే రచయిత అయిన దశరథ్ గారు ప్రస్తుతం డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. గోపీచంద్ హీరోగా వచ్చిన శౌర్యం సినిమా తరువాత ఆయన సినిమాలను చేయలేదు. మనసుకు తృప్తి కలుగకపోతే ఆ పని చేయలేమని చెప్పే దశరథ్ గారు బ్లాక్ బస్టర్ సినిమా నువ్వునేను కి రచయిత గా పనిచేసారు. ఇక అయన బాల్యం నుండి అనేక కష్టాలను పడ్డానంటూ తన వ్యక్తిగత జీవితం గురించి దశరథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
జీవితంలో ఎన్నో బాధలను భరించాను…
కొండపల్లి దశరథ్ కుమార్ గారి స్వస్థలం ఖమ్మం కాగా నాన్నగారికి ఎన్నో వందల ఎకరాల భూములు ఉన్నా అవన్నీ ప్రభుత్వం అటవీ భూమి కిందకు చేర్చడంతో పోయి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారట. బాల్యంలోనే ఒకవైపు షాప్స్ లో పనికి వెళుతూ మరోవైపు చదువుకున్న దశరథ్ గారు అప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
వాటి ముందు సినిమా అవకాశాల కోసం పడినవి కష్టాలుగా కనిపించలేదని చెప్పారు. ఇప్పుడు ఆర్ధికంగా బాగున్నా ఎక్కడికైనా కుటుంబంతో కలిసి బయటికి వెళ్ళినపుడు మా అమ్మ నాన్న ఉండి ఉంటే అన్న ఆలోచన బాగా బాధిస్తుందని తెలిపారు. తల్లి పదవ తరగతి చదివే సమయంలోనే పోగా తండ్రి సంతోషం సినిమా సమయంలో చనిపోయారని ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…