Visa will be canceled.. US Embassy strong warning..!
వాషింగ్టన్ D.C./హైదరాబాద్: అమెరికాలో దొంగతనాలు, దాడులు, దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని యూఎస్ ఎంబసీ తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి నేరాలకు పాల్పడిన వారికి న్యాయపరమైన శిక్షలతో పాటు, వీసా రద్దయ్యే ప్రమాదం ఉందని, అంతేకాకుండా మరోసారి అమెరికా రావడానికి వీలు లేకుండా డిటెన్షన్ కూడా విధిస్తామని స్పష్టం చేసింది. అమెరికాలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, విదేశీయులు కూడా ఇక్కడి చట్టాలను తప్పనిసరిగా పాటించాలని యూఎస్ ఎంబసీ ఒక పోస్ట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.
ఈ హెచ్చరికలు వెలువడిన నేపథ్యంలోనే, ఇటీవల ఇల్లినాయిస్ స్టేట్లో జరిగిన ఒక ఘటన వైరల్గా మారింది. ఒక భారతీయురాలు స్థానికంగా ఉన్న టార్గెట్ స్టోర్కు వెళ్లి ఏడు గంటల పాటు గడిపింది. దాదాపు రూ.11 లక్షల విలువైన వస్తువులను తన కార్ట్లో వేసుకుని, స్టోర్కు ఉన్న పశ్చిమ గేట్ నుంచి డబ్బులు చెల్లించకుండా పారిపోవడానికి ప్రయత్నించింది.
అయితే, ఆమె కదలికలపై అనుమానం వచ్చిన స్టోర్ సిబ్బంది అప్పటికే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఆ భారతీయురాలిని పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా ఆమె వారితో వాదించింది. “తానేమీ చేయలేదని, ఇంత చిన్న దానికే అరెస్ట్ చేస్తారా?” అంటూ మాట్లాడిన దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే యూఎస్ ఎంబసీ తాజాగా ఈ వార్నింగ్ను జారీ చేయడం గమనార్హం.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…