Thammareddy Bharadwaja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాలలో నటించారు.ఈ క్రమంలోనే తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా టికెట్ల వ్యవహారం పై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా సినిమా టికెట్ల రేట్లపై ఇండస్ట్రీలో ఉన్న సమస్య గురించి మీ సమాధానం , అభిప్రాయం ఏంటి అంటూ ఆయన అని ప్రశ్నించగా అసలు ఇండస్ట్రీలో సమస్య లేదనేది తన ఉద్దేశమని ఈయన తెలియజేశారు.సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.
సినిమా టికెట్ల రేట్లను తగ్గించినప్పుడు పెద్ద సినిమా నిర్మాతలు చాలా నష్టపోతారనే విషయాన్ని ప్రస్తావనకు తీసుకురాగా ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన చిత్రాలకు భారీ బడ్జెట్ అయ్యింది. అయితే ఈ పాన్ ఇండియా చిత్రాలు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే విడుదల కాలేదు. దేశ వ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో విడుదల అవుతున్నాయి కనుక సినిమా రేటు తగ్గించిన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబడుతోంది. అదే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలే అయితే కేవలం రెండు రాష్ట్రాలలో మాత్రమే విడుదల అవుతాయి కనుక ఈ సినిమాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు.
ఇలా పాన్ ఇండియా సినిమాలు దేశ వ్యాప్తంగా విడుదల కావడంతో ఆ సినిమాలకు కూడా ఎలాంటి నష్టం లేదని నా దృష్టిలో ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సమస్యలు లేవని ఆయన వెల్లడించారు. ఇన్ని రోజులు ఏ విషయాన్ని బయటకు ప్రస్తావించక మౌనంగా ఉండి పోతుంటే ఎవడికి వాడు రెచ్చిపోతున్నారు వీళ్ళందర్నీ చూస్తుంటే తిక్క రేగుతుంది అంటూ తమ్మారెడ్డి ఇ వెల్లడించారు. ఇక ముఖ్యంగా చిరంజీవి మహేష్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలు టికెట్ల రేట్లను పెంచమని ముఖ్యమంత్రిని అడుక్కోవడం దారుణమని ఈయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…