Writer & Director Dasarath : సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటరటైనర్స్ ను అందించిన డైరెక్టర్ అలాగే రచయిత అయిన దశరథ్ గారు ప్రస్తుతం డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘శౌర్యం’ సినిమా తరువాత ఆయన సినిమాలను చేయలేదు. మనసుకు తృప్తి కలుగకపోతే ఆ పని చేయలేమని చెప్పే దశరథ్ గారు బ్లాక్ బస్టర్ సినిమా నువ్వునేను కి రచయిత గా పనిచేసారు. ఇక అయన బాల్యం నుండి అనేక కష్టాలను పడ్డానంటూ తన వ్యక్తిగత జీవితం గురించి దశరథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సంతోషం సినిమా చేయనన్నాను…
నాగార్జున, శ్రీయ, గ్రేసీ సింగ్ నటించిన ‘సంతోషం’ సినిమా నాగార్జున గారి కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. ఆ సినిమా దశరథ్ గారి కెరీర్ కి మంచి హెల్ప్ అయింది. అలాంటి సినిమాను మొదట దశరథ్ గారు చేయకూడదని అనుకున్నారట. అయితే నువ్వునేను సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిన సమయంలో గోపాల్ రెడ్డి గారికి నటుడు బెనర్జీ ద్వారా కథ చెప్పడానికి వెళ్లి ఓకే చేయించుకున్నారట దశరథ్. అదే సమయములో వాళ్ళు నాగార్జున తో ఒక సినిమా చేయాల్సి ఉండగా కథ ఫైనల్ కాక ఎదురు చూస్తూ ఉన్నారట. ఆ సమయంలో దశరథ్ మరో కథ రెడీ చేసి అది నాగార్జున కు వినిపించడం ఆ కథ ఓకే అయిపోవడం జరిగిపోయాయి.
ఆ సినిమానే సంతోషం, ఆ సినిమా డైరెక్షన్ మొదట దశరథ్ చేయాలని అనుకోలేదు. కేవలం కథ అందించి వదిలేసారు. అయితే గోపాల్ రెడ్డి గారు మీరే డైరెక్షన్ చేయండి అని చెబితే నేను చేయను నాకు సమయం కావాలి చేయాలంటే ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా చేయలేను అని చెప్పేశారట. ఇక వేరే డైరెక్టర్ ని అనుకున్న సమయంలో నాగార్జున గారు మళ్ళీ పిలిచి ఎంత టైం కావాలి స్క్రిప్ట్ వర్క్ కోసం అని అడిగి ఒక ఆరు నెలలు కావాలని దశరథ్ చెబితే సరే తీసుకో మనం సినిమా చేస్తున్నాం. అంతవరకు నేను ఇంకో సినిమా చేయను అని మాటిచ్చి ఆ సినిమా దశరథ్ గారినే డైరెక్ట్ చేయమన్నారట. ఆలా సంతోషం సినిమా చేసానని ఆ సినిమా మంచి హిట్ అవ్వడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…