Writer Vijayendra prasad : ప్రభాస్ ఫంక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జై పవర్ స్టార్ అంటూ కేకలు వేశారు… ఆది చూసి నేనేం చేశానంటే…: రైటర్ విజయేంద్ర ప్రసాద్

Writer Vijayendra prasad : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణా, అనుష్క, రమ్యకృష్ణ నటించిన సినిమా బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. సినిమా రికార్డ్స్ గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ బాహుబలి ముందు బాహుబలి తరువాత అనే మాట్లాడుతాం. అంతలా చరిత్ర సృష్టించిన బాహుబలి సినిమా కథను సృష్టించింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పవన్ ఫ్యాన్స్ ను చూసే ఆ సీన్ పెట్టాను…

బాహుబలి రెండో భాగంలో ఇంట్రవెల్ దగ్గర వచ్చే పట్టాభిషేకం సన్నివేశం చూసిన ప్రేక్షకుడికి ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలా ఆ సీన్ డిజైన్ చేయాలని ఎలా అనిపించింది అనే ప్రశ్న ప్రసాద్ గారికి ఎదురుకాగా బాహుబలి ఆడియో వేడుక తిరుపతిలో చేసినపుడు జరిగిన ఒక సంఘటన ఆ సీన్ కు ప్రేరణ అంటూ చెప్పారు. బాహుబలి ఆడియో ఫంక్షన్స్ లో అడవి శేష్ నాకు మొదట అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంతో అక్కడున్న పవన్ అభిమానులు జై పవర్ స్టార్ అంటూ అరవడం మొదలు పెట్టారు.

ఆ వేడుక ప్రభాస్ ది కానీ అక్కడ పవర్ స్టార్ అంటూ అరుస్తున్నారు. ఆపండి అని చెబితే మరింత అరుస్తారు అందుకే సైలెంట్ గా ఉంటే ఫంక్షన్ అయిపోయే వరకు అలానే అరుస్తూ ఉన్నారు. ఆ సంఘటనే ఈ సీన్ కి ప్రేరణగా నిలిచింది. భల్లాల దేవుడు రాజు అయినా ఆయనకు రాజైన ఆనందం ఉండదు. బాహుబలి సైన్యాధ్యక్షుడు అయినా రాజులాగే జనం చూస్తారు. థియేటర్లలో కూడా జనాలతో చప్పట్లు కొట్టించిన సన్నివేశాల్లో ఒకటిగా ఆ సీన్ నిలిచింది అంటూ చెప్పారు.