Anchor Anasuya: అందరూ చూస్తుండగా అనసూయను పైకెత్తిన యూట్యూబర్ నిఖిల్… రచ్చ చేసిన అనసూయ!
Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూనే వెండితెరపై వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపై ఏదైనా పండుగలు లేదా ప్రత్యేక రోజులు వస్తే బుల్లితెర పై ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతాయి.
ఈ క్రమంలోనే ఉగాది పండుగ సందర్భంగా స్టార్ మా ఆగట్టునుంటావా.. ఈ గట్టు కొస్తావా అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంది కమెడియన్స్, సింగర్స్, యాంకర్స్, బుల్లితెర నటీనటులు పాల్గొని ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించారు.
ఇక ఈ కార్యక్రమంలో యాంకర్ అనసూయ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇలా ఆటపాటలతో ఎంతో సందడిగా కొనసాగిన ఈ కార్యక్రమంలో యాంకర్ రవి, బిగ్ బాస్ విన్నర్ సన్నీ, యూట్యూబర్ నిఖిల్ అనసూయను టార్గెట్ చేస్తూ తన పై పంచులు వేస్తూ తనని ఆట పట్టించారు.
ఇక ముక్కు అవినాష్ జ్యోతిష్యుడి గెటప్ లో వచ్చే అందరి జాతకాలు చేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే నిఖిల్ చేతి గీతలు చూస్తూ.. చేతిలో గీతలు అన్ని కనపడకుండా పోయాయని చెప్పడంతో వెంటనే అనసూయ అలా రుద్దుతున్నావ్ అంటూ నిఖిల్ కు సెటైర్ వేసింది.ఇలా అనసూయ నిఖిల్ పై సెటైర్లు వేయడంతో నిఖిల్ కూడా అనసూయ పై సెటైర్ వేశారు. ఇక నిఖిల్ అంతటితో ఆగకుండా ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా అనసూయను పైకి ఎత్తారు. ఇలా పైకి ఎత్తడంతో షాక్ అయిన అనసూయ తనని కిందికి దించాలని అరిచి గగ్గోలు పెట్టారు. అయితే తను చెప్పిన వాటికి ఒప్పుకుంటేనే కిందకు దింపుతానని నిఖిల్ చెప్పారు. దీంతో అక్కడున్న వారందరూ విజిల్స్..క్లాప్స్ తో హోరెత్తించారు.
అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే యువతలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. సాధారణ జీవితానికి భిన్నంగా ఉత్కంఠభరిత అనుభూతిని ఆస్వాదించాలనే కోరికతో వేలాది…
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…