బాల్య వివాహాలు అనేవి మన వ్యవస్థలో ఎప్పటి నుంచో ఉన్నవే. ఇప్పటికీ కొన్ని చోట్ల కొందరు బాల్య వివాహాలు జరిపిస్తూనే ఉన్నారు. దీంతో చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్న బాలికలకు ఇక జీవితమంతా నరక ప్రాయం అవుతోంది. ఒక వేళ భర్త మరణిస్తే ఇక ఆ బాలిక అలాగే జీవితాంతం ఉండాల్సిందే. సరిగ్గా ఇవే కష్టాలను అనుభవించాల్సి వస్తుందని అనుకుందో ఏమో గానీ ఆ యువతి మాత్రం తన బాల్య వివాహాన్ని చాలా తెలివిగా కోర్టులో రద్దు చేయించుకుంది. దీంతో ఇప్పుడామె ఉన్నత చదువులు చదివి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే పనిలో పడింది.
ఆమె పేరు సుశీల. రాజస్థాన్లోని జోధ్పూర్ లో ఉంటోంది. ఈమెకు తన 12వ ఏటే స్థానికంగా ఉన్న నరేష్ అనే వ్యక్తితో 2010వ సంవత్సరంలో పెళ్లి చేశారు. అయితే పెళ్లయినప్పటి నుంచి సుశీల తల్లి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో సుశీలకు 18 ఏళ్ల వయస్సు నిండగానే అత్త వారింటి దగ్గర దిగబెట్టడానికి పుట్టింటి వారు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అలా వెళ్లడం సుశీలకు ఇష్టం లేదు. దీంతో తన మనస్సులో ఉన్న మాటను ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. తాను చదువుకుంటానని, చదువంటే ఇష్టమని, అత్తింటికి పంపవద్దని వేడుకుంది. అయినా వారు వినలేదు. సుశీలను అత్తింట్లో దిగబెట్టేందుకే సిద్ధమయ్యారు.
దీంతో సుశీల 2016, ఏప్రిల్ 27న ఇంట్లో నుంచి అర్థరాత్రి బయటకు వచ్చేసింది. జోధ్పూర్లో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు కృతి భారతి సహాయంతో రీహాబిలిటేషన్ సెంటర్లో చేరింది. అక్కడ ఉండే కోర్టులో కేసు వేసింది. తన 12వ ఏట తనకు పెళ్లి జరిగిందని, తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని, ఇప్పుడు మేజర్ అయ్యాను కనుక ఆ పెళ్లిని రద్దును చేయాలని కోర్టులో కోరింది. అయితే కోర్టు వారికి పెళ్లి అయినట్టుగా సాక్ష్యాలు చూపమంది. అయితే అవి సుశీల వద్ద లేవు. దీంతో ఆమె సుమారు 15 నెలల పాటు కోర్టులో పోరాడింది. ఈ క్రమంలో నే భర్తకు చెందిన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసిన తన పెళ్లి ఫొటోలు ఆమెకు కనిపించాయి. వాటి సహాయంతో కోర్టులో మరోసారి వాదించింది. దీంతో కోర్టు సుశీల పెళ్లిని రద్దు చేసింది. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు స్వేచ్ఛగా జీవిస్తోంది. ఉన్నత చదువులు చదువుతోంది. గొప్ప స్థానాలకు చేరుకోవాలని ఆమె కల, ఆశయం. బాగా చదివి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఆమె కోరుకుంటోంది. ఆమె కల నెరవేరాలని మనమూ కోరుకుందాం. ఏది ఏమైనా ఈ విషయంలో సుశీలను అందరం అభినందించాల్సిందే..!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…