ఆకాశంలో అద్భుతం జరుగనుంది. బుధవారం రాత్రి ఇది కనిపించనుంది. జెమిని తారామండలం నుంచి వచ్చే ఉల్కలను బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు బైనాక్యులర్లు, టెలిస్కోపుల అవసరం లేకుండానే ప్రజలు చూడవచ్చునని కోల్కతాలోని ఎంపీ బిర్లా నక్షత్రశాల సంచాలకుడు దేవీప్రసాద్ దురై వెల్లడించారు. నగర కాంతులకు దూరంగా.. చీకటి ప్రదేశాలకు వెళ్తే ఉల్కాపాతాన్ని మెరుగ్గా వీక్షించవచ్చునని ఆయన సూచించారు. గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఉల్కాపాతం తారస్థాయిలో ఉంటుందని దేవీప్రసాద్ చెప్పారు. ఈ తరహా ఉల్కాపాతం చాలా అరుదుగా కనిపిస్తుందని ఆయన తెలిపారు.
ఈ ఉల్కాపాతాన్ని చూసేందుకు ప్రత్యేకంగా ఖగోళ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 2 గంటల వరకు భారీగా ఉల్కలు ఆకాశంలో కనువిందు చేస్తాయని అన్నారు. ఈ ఉల్కలు రాలుతున్న తారల్లా కనిపించనున్నాయి. మిథునరాశి కూటమిలో ఉల్కలు మెరుస్తూ కనిపిస్తాయని, దాదాపు గంటకు 120 వరకు ఉల్కలు పతనం కానున్నాయని తెలిపారు. చీకటి ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి ఉల్కలు స్పష్టంగా కనిపిస్తాయని దురై తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…