Categories: General News

ఏటీఎం కార్డ్ హాల్డర్లకు బంపర్ ఆఫర్స్.. తెలియకపోతే నష్టపోతారు!! షేర్ చేయండి..

బ్యాంకింగ్ లావాదేవీలన్నా డిజిటలైజ్ అయిన తర్వాత ఆన్ లైన్ లావాదేవీలు మాత్రమే చేయాల్సిన అనివార్యత వచ్చింది. ఇందులో భాగంగా దేశంలోని బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఏటీఎం కార్డులు ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు తమ కష్టమర్లలో 90శాతం మంది వరకు రూపే ఏటీఎం కార్డులే ఇస్తున్నాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఖాతాలు తీసిన వారికీ రూపే ఏటీఎం కార్డులే పంపిణీ చేశాయి. గ్రామీణ బ్యాంకులన్నీ తమ అకౌంట్ హోల్డర్లకు కంపల్సరీగా రూపే కార్డు ఇస్తున్నాయి.


అయితే చాలా మందికి తెలియని విషయం.. రూపే కార్డు హోల్డర్లు ఇన్సూరెన్స్‌కు అర్హులు. రూపే కార్డుదారులకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ఇన్సూరెన్స్‌ను కేంద్రం అందజేస్తుంది. అన్ని బ్యాంకుల రూపే ఏటీఎం, డెబిట్‌ కార్డుదారులకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తాజాగా తెలిపింది. ప్రమాదంలో మరణించిన, శ్వాశ్వత వైకల్యం పొందిన వారికి ఇన్సూరెన్స్‌ లభిస్తుంది. రూపే క్లాసిక్‌ కార్డుదారుడైతే రూ.లక్ష, రూపే ప్రీమియం కార్డుదారుడైతే రూ.2 లక్షలను వారి కుటుంబ సభ్యులకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఇండియా చెల్లిస్తుంది. ప్రమాదం జరిగిన 90 రోజుల్లోగా ఇన్సురెన్స్‌ను క్లెయిమ్‌ చేసుకోవాలి. నామినీ లేదా వారి వారసులు అర్హులు. ఇక ఐసీఐసీఐ బ్యాంకు తమ ఏటీఎం హోల్డర్లకు ఓ కొత్త ఆఫర్ ఇచ్చింది.

ఏటీఎంలలో డబ్బులు తీసుకున్నంత సులువుగా రూ. 15లక్షల వరకు వ్యక్తిగత లోన్లు అందించేందుకు ఐసీఐసీఐ సిద్ధమైంది. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తించనుంది. ఇందుకోసం కంపెనీల నుంచి ఉద్యోగుల సమాచారం తీసుకుని.. అందులో నుంచి వ్యక్తిగత లోన్ల కోసం కొందరు కస్టమర్లను ఎంపిక చేస్తుంది. ఈ వినియోగదారులు ఏటీఎం ద్వారా నగదు ట్రాన్సాక్షన్‌ చేసుకున్నప్పుడు స్క్రీన్‌పై లోన్‌ గురించి మెసేజ్‌ వస్తుంది. అప్పుడు కస్టమర్‌ దాన్ని సెలెక్ట్‌ చేసుకుంటే.. రూ. 15లక్షల వరకు లోన్‌ ఇవ్వనున్నట్లు ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఐదేళ్ల గడువుతో ఈ లోన్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. లోన్‌ ఎంత కావాలో సెలెక్ట్‌ చేసుకుంటే వెంటనే ఆ నగదు వినియోగదారుడి ఖాతాలోకి బదిలీ అవుతుంది. లోన్‌ ఎంత కావాలో ఏటీఎం స్క్రీన్‌పైనే సెలెక్ట్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజు, నెలవారీ వాయిదాలు తదితర వివరాలను కూడా స్క్రీన్‌పై కష్టమర్లు చూడవచ్చు. 60నెలల ఫిక్స్‌డ్ కాలవ్యవధిలో కష్టమర్లు రూ.15లక్షల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు స్పష్టం చేసింది. అవన్నీ నచ్చితే.. ఏటీఎంలలోనే లోన్‌ తీసుకోవచ్చు. ఐసీఐసీఐ నుంచి ఒక్కసారి కూడా లోన్‌ తీసుకోని వారికి సైతం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago