Categories: General News

ఏటీఎం కార్డ్ హాల్డర్లకు బంపర్ ఆఫర్స్.. తెలియకపోతే నష్టపోతారు!! షేర్ చేయండి..

బ్యాంకింగ్ లావాదేవీలన్నా డిజిటలైజ్ అయిన తర్వాత ఆన్ లైన్ లావాదేవీలు మాత్రమే చేయాల్సిన అనివార్యత వచ్చింది. ఇందులో భాగంగా దేశంలోని బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఏటీఎం కార్డులు ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు తమ కష్టమర్లలో 90శాతం మంది వరకు రూపే ఏటీఎం కార్డులే ఇస్తున్నాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఖాతాలు తీసిన వారికీ రూపే ఏటీఎం కార్డులే పంపిణీ చేశాయి. గ్రామీణ బ్యాంకులన్నీ తమ అకౌంట్ హోల్డర్లకు కంపల్సరీగా రూపే కార్డు ఇస్తున్నాయి.


అయితే చాలా మందికి తెలియని విషయం.. రూపే కార్డు హోల్డర్లు ఇన్సూరెన్స్‌కు అర్హులు. రూపే కార్డుదారులకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ఇన్సూరెన్స్‌ను కేంద్రం అందజేస్తుంది. అన్ని బ్యాంకుల రూపే ఏటీఎం, డెబిట్‌ కార్డుదారులకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తాజాగా తెలిపింది. ప్రమాదంలో మరణించిన, శ్వాశ్వత వైకల్యం పొందిన వారికి ఇన్సూరెన్స్‌ లభిస్తుంది. రూపే క్లాసిక్‌ కార్డుదారుడైతే రూ.లక్ష, రూపే ప్రీమియం కార్డుదారుడైతే రూ.2 లక్షలను వారి కుటుంబ సభ్యులకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఇండియా చెల్లిస్తుంది. ప్రమాదం జరిగిన 90 రోజుల్లోగా ఇన్సురెన్స్‌ను క్లెయిమ్‌ చేసుకోవాలి. నామినీ లేదా వారి వారసులు అర్హులు. ఇక ఐసీఐసీఐ బ్యాంకు తమ ఏటీఎం హోల్డర్లకు ఓ కొత్త ఆఫర్ ఇచ్చింది.

ఏటీఎంలలో డబ్బులు తీసుకున్నంత సులువుగా రూ. 15లక్షల వరకు వ్యక్తిగత లోన్లు అందించేందుకు ఐసీఐసీఐ సిద్ధమైంది. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తించనుంది. ఇందుకోసం కంపెనీల నుంచి ఉద్యోగుల సమాచారం తీసుకుని.. అందులో నుంచి వ్యక్తిగత లోన్ల కోసం కొందరు కస్టమర్లను ఎంపిక చేస్తుంది. ఈ వినియోగదారులు ఏటీఎం ద్వారా నగదు ట్రాన్సాక్షన్‌ చేసుకున్నప్పుడు స్క్రీన్‌పై లోన్‌ గురించి మెసేజ్‌ వస్తుంది. అప్పుడు కస్టమర్‌ దాన్ని సెలెక్ట్‌ చేసుకుంటే.. రూ. 15లక్షల వరకు లోన్‌ ఇవ్వనున్నట్లు ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఐదేళ్ల గడువుతో ఈ లోన్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. లోన్‌ ఎంత కావాలో సెలెక్ట్‌ చేసుకుంటే వెంటనే ఆ నగదు వినియోగదారుడి ఖాతాలోకి బదిలీ అవుతుంది. లోన్‌ ఎంత కావాలో ఏటీఎం స్క్రీన్‌పైనే సెలెక్ట్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజు, నెలవారీ వాయిదాలు తదితర వివరాలను కూడా స్క్రీన్‌పై కష్టమర్లు చూడవచ్చు. 60నెలల ఫిక్స్‌డ్ కాలవ్యవధిలో కష్టమర్లు రూ.15లక్షల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు స్పష్టం చేసింది. అవన్నీ నచ్చితే.. ఏటీఎంలలోనే లోన్‌ తీసుకోవచ్చు. ఐసీఐసీఐ నుంచి ఒక్కసారి కూడా లోన్‌ తీసుకోని వారికి సైతం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది.

telugudesk

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

9 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

9 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

9 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

10 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

11 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

11 hours ago