Categories: General News

గుడిచుట్టూ ప్రదక్షిణ చేయటానికి వీలు లేకపోయినా తిరుగుతూ 3500 అడుగుల లోయలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు..

తనను మంచిగా చూడమని ఆ దేవుణ్ణి వేడుకుంటూ చావు కొసలమీద విన్యాసం చేస్తున్నారు భక్తులు.అంటే ఒక్క అడుగు తడబడినా భూలోకం నుంచి పరలోక యాత్రనే.. ఇక్కడ విజయవంతమైన ఒక్కో ప్రదక్షిణ ఆయుష్షును నిలబెట్టినట్టే. పట్టుతప్పితే ఇక ఆయువు తీరినట్టే.. భక్తి అనబడే పిచ్చి పీక్స్ కు చేరి ఓ ఆలయం చుట్టూ చావును వెంబడేసుకుని ప్రదక్షిణ చేసే వింత ఆలయం ఒకటి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ భక్తుడు తాజాగా కేవలం కొద్దిగా కాలుజారినందుకే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇది వెలుగులోకి రావడంతో దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. కాని ఇటువంటి చావు బతుకుల మధ్య ప్రదక్షిణలు ఈ ఆలయంలో నిత్య కృత్యమని చెబుతున్నారు. ఈ ప్రదక్షిణ రూపంలోని పరలోక యాత్ర గురించి తెలుసుకోవాలంటే తమిళనాడులోని తిరుచ్చికి వెళ్లాలి..

తమిళనాడు లోని తిరుచ్చి దగ్గరలో ఉన్న ఒక ఆలయం పేరు “సంజీవి పెరుమాళ్ కోవెల”. ఇది భూమికి 3500 అడుగుల ఎత్తులో ఉంటుంది. గుడి చుట్టూ ఏమీ చోటు లేదు, పట్టుతప్పితే పై లోకాలకు పంపే ప్రమాదకరమైన లోయ. చాలా మంది గుడి చుట్టూ చిన్న అంచుపై సర్కస్ చేసినట్లు గుండె గుప్పెట్లో పెట్టుకునైనా గుడి చుట్టూ తిరగటం చేస్తారు. కానీ శనివారం ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మూడో చుట్టూ తిరుగుతుండగా పట్టుతప్పి లోయలో పడిపోయాడు. ఈ వీడియో చూడండి. అంచుపై నడవటం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుస్తుంది.


ప్రదక్షిణ అంటే భక్తులు ఆలయ అంచుల వెంట, ఆ రాతి ప్రహరీ వెంట, చేత్తో జాగ్రత్తగా రాళ్లను పట్టుకుంటూ, ఒక్కొక్క అడుగే ఆచితూచి వేయాలి. ఇంత ప్రమాదకరం అయినా సరే కొందరు భక్తులు ఆ సాహసోపేత, ప్రాణాంతక ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. అది చేస్తేనే దేవుడి కరుణ దక్కుతుందనేది వారి పిచ్చి నమ్మకం. ఇప్పుడు ఓ భక్తుడు ఇలా గిరివాలయం మూడో ప్రదక్షిణ చేస్తూ పడిపోయిన దృశ్యాన్ని అక్కడి వారు కెమెరాలో బంధించేప్పటికి తమిళ్ మీడియా కథనాలు వేసింది. ఇక అంతే దాని ఆధారంగా దేశ వ్యాప్తంగా మీడియా ఫోకస్ చేసింది. సోషల్ మీడియాలోనూ బతకడానికి ఉండాల్సిన భక్తిని చావుకు సమర్ఫణగా మల్చుకోవడంపై ఒకింత ఆశ్చర్యం, ఒకింత ఆవేదనతో స్పందిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ప్రదక్షిణ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వైనాన్ని కింది వీడియోలో చూడండి మీకే తెలుస్తుంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago