అక్కనేని అమల. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సతీమణి. ఆయన మనసు కొల్లగొట్టిన అందాల తార. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి జనాల మనసులు దోచి హీరోయిన్. ఎక్కడో విదేశాల్లో పెరిగి ఇక్కడే ఎక్కవ సినిమాలు చేసి ఇక్కడి అబ్బాయినే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ నటీమణి. ఇంతకీ నాగార్జునతో అమలకు ఎక్కడ పరిచయం ఏర్పడింది.? వీరి పెళ్లి? ఎలా జరిగింది.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అమల 1968 సెప్టెంబర్ 12న కోల్ కతాలో పుట్టింది. తన తండ్రి ముఖర్జీ బెంగాలీ వ్యక్తి. నేవీ ఆఫీసర్ గా పనిచేశాడు. తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు. అమల చిన్నతనం అంత కూడా విదేశాల్లోనే సాగింది. కొన్నాళ్ళకు ఇండియా కి వచ్చారు. ఇక అమల తల్లిదండ్రులు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం అమల తండ్రి ఖరగ్ పూర్ లో ప్రొఫెసర్ గా పని చేసాడు. అమల తల్లి హాస్పిటల్ మేనేజ్మెంట్ లో పని చేసింది.
అందుకే అమల పేరెంట్స్ వైజాగ్, చెన్నై సహా పలు ప్రాంతాలలో నివాసం ఉన్నారు. ఆ సమయంలో సినిమాల వైపు మొగ్గు చూపింది అమల. చిన్నతనం నుండో నృత్యం నేర్చుకున్న అమల అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ఇక టి. రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన మిథిలి ఎన్నై కాథాలి అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. మొత్తం తన కెరీర్ లో 54 సినిమాలు చేసింది. ఇందులో ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
కిరాయి దాదా సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది అమల. ఆ తర్వాత చినబాబు, రక్త తిలకం, శివ, ప్రేమయుద్ధం, రాజా విక్రమార్క, అగ్గిరాముడు, నిర్ణయం, ఆగ్రహం సహా పలు సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో పలు సినిమాలు చేసింది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
తెలుగులోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లోనే నాగార్జున, అమలపై మనసు పారేసుకున్నాడు. ముందుగా నాగార్జునే ప్రపోజ్ చేసారట. కాకపోతే తనకు ప్రపోజ్ చేయడానికి 5 ఏళ్లు వెయిట్ చేశారట. ఆ సమయంలో నాగార్జున ప్రపోజ్ చేయగానే.. అమల బోరున ఏడ్చేసిందట. ఆ తర్వాత తను కూడా ఒప్పుకుందట. నిర్ణయం సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. అయితే తమ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పింది అమల. 1992లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి తర్వాత అమల నాగార్జునలకు అఖిల్ జన్మించాడు.
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…