మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని గ్లోబల్ హెల్త్ కౌన్సిల్ చైర్మెన్ డాక్టర్ జోనాథన్ క్విక్ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో విషపూరిత ఇఫ్లూయెంజా వైరస్ మానవాళిపై విరుచుకుపడబోతోందని ఆయన అంటున్నారు. ఆ వైరస్ను అరికట్టగలిగే మందులుగానీ, వ్యాక్సిన్లు గానీ ఇంకా లేవని జోనాథన్ చెబుతున్నారు. నాలుగు రోజుల్లోనే ఆ వైరస్ మానవుని శరీరంలో ప్రవేశిస్తుందని ఆయన అన్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు.
ఆ వైరస్ ఒక్క వ్యక్తికి సోకి అతడి ద్వారా ఇతరులకు సోకేందుకు కూడా ఎక్కువ సమయం పట్టకపోవడం వల్ల దాని ప్రమాద స్థాయిని మనం ఊహించలేమని ఆయన చెబుతున్నారు. కేవలం రెండు వందల రోజుల్లో మొత్తం 33 లక్షల మందిని అది పొట్టన పెట్టుకుంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకడం వల్ల 3 కోట్ల మంది మృత్యువాత పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఇప్పటికే శాస్త్రవేత్తలు ఆ వైరస్ను ఎదుర్కొగల వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారని జోనాథన్ చెప్పారు. ఆలోగా వైరస్ వ్యాప్తి జరిగితే అరికట్టడం మాత్రం వారి చేతుల్లో ఉండబోదని ఆయన స్పష్టం చేస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వెంటనే వైరస్ గాలి ద్వారా ఆరోగ్యవంతుడైన మనిషిలోకి ప్రవేశిస్తుందని ఆయన అన్నారు. దయచేసి అందరికీ షేర్ చేయండి ..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…