Categories: General News

బయటపడ్డ ఎస్బీఐ బండారం..వినియోగదారులను భారీగా మోసం చేస్తున్న ఎస్బీఐ

దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ తన వినియోగదారులను భారీగా మోసం చేస్తోంది. అసలు ఎందుకు కట్ చేస్తున్నారో కూడా తెలియకుండా వినియోగదారుల అకౌంట్లలో నుంచి డబ్బులు కట్ చేస్తూ.. అడిగిన వారితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అ తేకాదు కొన్నిసార్లు డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నారో బ్యాంకు అధికారులకే తెలియవు. ఇటీవల క్రిష్ణ మోహన్ శర్మ అనే వ్యక్తి ఖాతాలో నుంచి 150 రూపాయలు కట్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.

దీంతో వెంటనే అనుమానం వచ్చిన క్రిష్ణ మోహన్‌ శర్మ, తన ఖాతా ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు ఏ.ఎస్‌.రావు నగర్ బ్రాంచ్‌కి వెళ్లి వివరణ కోరాడు. బ్యాంకు అధికారులు అతనికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై వెంటనే క్రిష్ణ మోషన్‌ శర్మ “బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌”కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన బ్యాంక్ అధికారులు అకౌంట్ స్టేట్‌మెంట్‌ కోసం 150 రూపాయలు కట్ చేసినట్లు తెలిపారు. అసలు బ్యాంకు స్టేట్మెంటే తీసుకోలేదని.. ఆ సమయంలో బ్యాంకులోనే లేనని.. అయినా అధికారులు డబ్బులు కట్ చేశారని వాపోయాడు.

బ్యాంకు అధికారుల తీరును రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినా అతడికి న్యాయం జరుగలేదు. అయితే పట్టువదలని క్రిష్ణమోహన్ కోర్టును ఆశ్రయించాడు. హిడెన్ చార్జీల రూపంలో అర్థం పర్థం లేని చార్జీలను కస్టమర్ల అకౌంట్ల నుండి కట్ చేస్తున్నారని, ఇది తన ఒక్కడి సమస్య కాదని ప్రతి వినియోగదారుడికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతున్నాయని తన ఆవేదన వ్యక్తపర్చాడు. కోర్టు వెంటనే ఎస్‌బీఐ బ్యాంక్ ఏ.ఎస్‌.రావు నగర్ బ్రాంచ్ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది..

telugudesk

Recent Posts

బంగారం కొనేవారికి షాక్.. దిగుమతి సుంకం డబుల్!

కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లను నియంత్రించడమే లక్ష్యంగా,…

11 hours ago

ఇంధన ధరలు మళ్లీ పెరుగుతాయా? గవర్నర్ కీలక వ్యాఖ్యలు

దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలపై ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో…

12 hours ago

ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ వేడుకకు భారీ ఏర్పాట్లు.. దేశవ్యాప్తంగా దృష్టి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విడుదలకు ముందు ప్రచార…

12 hours ago

ప్రధాని కాన్వాయ్‌పై కీలక నిర్ణయం.. ఇంధన పొదుపుకు కొత్త దిశ..

దేశంలో ఇంధన వినియోగం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు…

12 hours ago

రైతుల ఆరాధ్య దైవంగా వెలిగిపోతున్న కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి.. తొలి పంట స్వామివారికే సమర్పణ!

తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న కొమ్మాల గ్రామం ఆధ్యాత్మికతతో పాటు రైతు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య…

14 hours ago

పెన్సిల్ లిడ్‌పై హనుమంతుడు..! సూక్ష్మ కళతో షాక్ చేసిన గిన్నిస్ రికార్డ్ కళాకారుడు!

ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన…

15 hours ago