అశ్లీలం..ఇప్పుడు మొబైల్ లో చాలా ఈజీగా దొరికేస్తోంది. మొబైల్ లో నెట్ ఉంటే చాలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. మన మొబైల్ లో ప్రత్యక్షం అయిపోతుంది. చిన్న పిల్లలకు సైతం మొబైల్ కంపల్సరీ అయిపోయిన ఈ రోజుల్లో అదేస్థాయిలో అశ్లీలం కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో నేటి యువత పెడదోవ పడుతోంది. నేటి పేరంట్స్ కి ఇది సమస్యగా మారింది. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో పాతబస్తీ పహాడీఫరీఫ్ లో జరిగింది. కుమారుడు పదేపదే మొబైల్ లో చూస్తుండటంతో మందలించాడు తండ్రి. అయినా ఎన్నిసార్లు మందలించినా వినకపోవటంతో కోపంతో చేయి నరికేశాడు. ఈ షాకింగ్ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ పాతబస్తీ పహాడీఫరీష్ జల్ పల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖయ్యుం వృత్తిరీత్యా ఎలక్ట్రిషియన్. పెద్ద కుమారుడు ఖాలెద్ ఖురేషీ (18) లోకల్ కేబుల్ ఆఫీస్ లో పని చేస్తుంటాడు. కొంత కాలంగా ఖురేషీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. సరిగా పనికి కూడా వెళ్లటం లేదు. ఎప్పుడూ మొబైల్ చూస్తూ ఉన్నాడు. ఇది గమనించిన తండ్రి.. ఏం జరుగుతుందో అని దృష్టి పెట్టాడు. అశ్లీల దృశ్యాలు చూస్తున్నాడని గుర్తించి మందలించాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో కుమారుడి మొబైల్ ని కనిపించకుండా దాచేశాడు. దీంతో తండ్రి – కొడుకు మధ్య గొడవ జరిగింది. ఓ సారి తండ్రిపైనే దాడి చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ సర్ధిచెప్పి ఇంటికి తీసుకొచ్చాడు తండ్రి. అయినా వినకుండా మార్చి 5వ తేదీ సోమవారం ఇంట్లో ఖురేషీ అదే పనిగా మళ్లీ మొబైల్ చూస్తూ తండ్రి కంట పడ్డాడు.
కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. తండ్రి ఖయ్యూం.. మాంసం కొట్టే కత్తితో కుమారుడి చేయి నరికాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఖురేషీని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కుమారుడి చేయి నరికింది నేనే అంటూ తండ్రి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు తండ్రి ఖయ్యూం..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…