“సైరా నరసింహారెడ్డి” తరువాత చిరంజీవి చేస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు కొరటాల శివ. ఈ మధ్యనే చిరంజీవి, త్రిష లపై ఒక పాటను షూటింగ్ చేస్తున్నారు. దేవాదాయశాఖ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన కలిగే చెడు ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఈ చిత్ర అసలు కథ. ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగిగా మెగాస్టార్ ఒదిగిపోనున్నారు.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సొంత ప్రొడక్షన్ కాబట్టి ఖర్చు విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారట చిరంజీవి. దుబారా కాకుండా పకడ్బందీగా చిత్రాన్ని తెరకెక్కించమని సూచించారట మెగాస్టార్. సినిమాలో అనవసర సీన్స్ లేకుండా ముందుగానే పేపర్ మీద ఎడిటింగ్ చేసుకుని సెట్స్ పైకి వెళ్తున్నారట. ఈ సినిమా ఎలాగైనా 90 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలనీ కొరటాల శివకి టార్గెట్ పెట్టాడట చిరంజీవి. దాని ప్రకారమే కొరటాల ప్లాన్ చేసుకుని షూటింగ్ చేస్తున్నారట. సైరా విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని, అనవసర సీన్స్ చాలా ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందని, ఈ సినిమాకు అలా జరగకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారట చిరంజీవి. ఈ చిత్తానికి “గోవిందా హరి” మరియు “గోవిందాచార్య” అనే పేరును పరిశీలిస్తున్నారట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…