ఆంద్రప్రదేశ్ హైకోర్టులో సీఎం జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్రంలోని పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే వైసీపీ రంగులను తొలగించాలని ఆదేశించింది. పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఆ పిటీషన్ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ కార్యాలయాలు ప్రభుత్వానికి సంబందించినవి, వీటికి ఏ పార్టీకి సంబందించిన రంగులు ఉండరాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
అంతేకాదు ఈ రంగులు తొలగించే భాద్యతను తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది హైకోర్టు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5 కి వాయిదా వేసింది. అయితే ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలా ప్రభుత్వ కార్యాలయాలకు ఆ పార్టీ రంగులను వేస్తోంది. ఒక చోట జాతీయ జెండాను కూడా చేపివేసి అక్కడ వైసీపీ రంగులు వేయడం వివాదాస్పదమైంది. దీనిపై కలక్టర్ స్పందించి వెంటనే వాటిని తీయించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…