10 రూపాయల నాణెం వద్దన్నాడని.
రూ.10 నాణేలు చెల్లుతాయనీ.. ఎలాంటి అభ్యంతరం లేకుండా వాటిని ఉపయోగించుకోవచ్చని అర్బీఐ ఎంత మొత్తుకుంటున్నా వినని వారికి ఈ వార్త నిజంగా హెచ్చరికలాంటిదే. పది రూపాయల నాణెం తీసుకోనంటూ మొండికేసిన ఓ షాపు యజమానిపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొరీనా జిల్లాలోని మౌరాలో శుక్రవారం చోటుచేసుకుందీ సంఘటన. చేతి రుమాలు కొనేందుకు వినియోగదారుడు రెండు పది రూపాయల కాయిన్లు ఇవ్వబోగా.. వాటిని తీసుకునేందుకు షాపు యజమాని అంగీకరించలేదు.
దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారి ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఈ చట్టం కింద నిందితులుగా తేలితే ఆరు నెలల కారాగార శిక్ష పడుతుంది. పది రూపాయల కాయిన్లు తీసుకునేందుకు వ్యాపారులు తిరస్కరిస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో… ఇది భారత కరెన్సీని అవమానించడమేనని పేర్కొంటూ మొరీనా కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…