పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి తనదాకా వచ్చి పోయిన సినిమాలు కూడా ఉన్నాయని సినీ రచయిత వెలిగొండ శ్రీనివాస్ అన్నారు. అందులో ముఖ్యంగా ప్రముఖ నటుడు మహేశ్ బాబుతో ఒక ఏలియంట్ ప్రాజెక్టు చేద్దామని అనుకున్నట్టు ఆయన తెలిపారు. అది 100 కోట్ల బడ్జెట్తో చేసేందుకు ప్లాన్ వేశానని శ్రీనివాస్ చెప్పారు.
అది ఎప్పుడు అంటే అఖిల్తో సినిమా హిట్ అయితే .. అని ఆయన స్పష్టం చేశారు. అలా ఆలోచన వచ్చినపుడు అది 100 కోట్ల బడ్జెట్ అయితే, అదే సినిమా ఇప్పుడు తీయాలంటే దాదాపు 200 కోట్లు అవుతుందని ఆయన అన్నారు. అంతేగాకుండా ఆ ప్రాజెక్టులోని ఓ లైన్ను కూడా కోడి రామకృష్ణకు చెబితే, ఆయన చాలా బాగుందని మెచ్చుకున్నట్టు ఆయన తెలిపారు.
అయితే అంతకుముందున్న చేసే ప్రాజెక్టు హిట్ అయితే ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇలాంటి ప్రయోగాలు ఇలా చేయడానికి ఉంటుందని అలా రెడీ చేసి పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. అది నిజానికి మహేశ్ బాబు గారికి చెప్పలేదు. కానీ ఆ తర్వాత ఆగిపోయానని ఆయన స్పష్టం చేశారు. ఈ హై బడ్జెట్లు వద్దు. మన నెత్తి మీద భారం పెట్టుకోవడం వద్దు. మనం మోయలేమని బాత్ నుంచి తానే నిర్ణయం మార్చుకున్నట్లు ఆయన వివరించారు. ఇలాంటి చిన్న కథలే చేద్దాం. ఈ తలనొప్పులు ఎందుకు అని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.
నిజం చెప్పాలంటే తాను అలాంటి హై బడ్జెట్ తీయడానికి ధైర్యం చేయలేకపోయానని శ్రీనివాస్ తెలిపారు. ఒకవేళ సక్సెస్ వచ్చి ఉంటే రకరకాలుగా ఆలోచించి ఎలాగైనా అలాంటి పెద్ద హీరోలతో అంతటి స్థాయిలో సినిమా తీసేవాడినని ఆయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…