దేశంలోని ప్రజల్లో చాలామంది ఇప్పటివరకు 2020 లాంటి సంవత్సరాన్ని తాము చూడలేదని చెబుతున్నారు. ఈ ఏడాది దేశంలో గతంలో ఏ వైరస్ వ్యాప్తి చెందనంత వేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందింది. దేశంలోని ప్రజలకు ఏ మాత్రం అవగాహన లేని లాక్ డౌన్ కరోనా వల్ల సుపరిచితమైంది. ప్రతి సంవత్సరం లక్షల్లో లాభాలు పొందిన వ్యాపారులు ఈ ఏడాది నష్టాలను చవిచూశారు.
ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. గతంలో ఎప్పుడూ అప్పుపై ఆధారపడని వారు సైతం ఈ ఏడాది అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అంతోఇంతో మెరుగ్గా ఉన్నా వేతనాల్లో కోత విధించడంతో ప్రైవేట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పదేళ్ల క్రితమే 2020 గురించి ఊహించి ఒక బాలుడు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బాలుడు కరోనా వైరస్ గురించి ప్రత్యక్షంగా ఏం చెప్పకపోయినా అతను చేసిన కామెంట్లలోని అర్థం గమనిస్తే అతను చెప్పింది నిజమేనని అర్థమవుతోంది. 2020 సంవత్సరంలో ప్రజలంతా ప్రశాంతంగా బ్రతుకుతారని.. ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడినా ధీటుగా ఎదుర్కొంటారని చెప్పాడు. ఈ సంవత్సరం నిజంగానే ప్రజలు ప్రశాంత జీవనం గడిపారు. ప్రజలు కరోనా లాంటి వ్యాధిని ధీటుగా ఎదుర్కొన్నారు.
కెవిన్ సింగ్ పదేళ్ల క్రితమే ఈ సంవత్సం పరిస్థితులను సరిగ్గా ఊహించడం గమనార్హం. కెవిన్ వర్జీనియా ప్రాంతానికి చెందిన వారు. తను చెప్పిన జాతకం నిజమైందని తెలిసి కెవిన్ సోషల్ మీడియా వేదికగా తనను క్షమించిమని పోస్ట్ పెట్టడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…