Featured

ఆ గుడిలో కరోనా కల్లోలం.. 400 మందికి వైరస్ నిర్ధారణ..!

దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తుందో, వ్యాప్తి చెందుతుందో తెలియడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే గుడిలోని 400 మంది కరోనా బారిన పడ్డారు. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన 400 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడం గమనార్హం. ఆలయ అధికారులు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రముఖ దేవాలయాలు ప్రజలను దర్శనానికి అనుమతి ఇస్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

గత కొన్ని రోజులుగా భక్తులు పూరీ దేవాలయాన్ని తిరిగి తెరవాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ వార్త అటు భక్తులను, ఇటు అధికారులను ఆందోళనకు గురి చేస్తుండటం గమనార్హం. లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి నుంచి పూరీ జగన్నాథ్ ఆలయం మూసి ఉంది. ఆలయ పర్యవేక్షణ అధికారి అజయ్‌ కుమార్‌ జేనా మాట్లాడుతూ 9 మంది మృతి చెందగా 16 మంది ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్నారని వెల్లడించారు.
 
భువనేశ్వర్‌లోని కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కరోనా సోకిన మిగతా సిబ్బంది హోం ఐసోలేషన్ ద్వారా చికిత్స పొందుతున్నారు. ఆలయాన్ని తెరవడానికి సిబ్బంది కొరత ఉండటంతో ఇప్పట్లో ఆలయం తెరిచే పరిస్థితి లేదని సమాచారం. ప్రస్తుతం పూరీ జగన్నాథుని ఆలయంలో నిత్య పూజలు మాత్రం యథాతథంగా జరుగుతున్నాయి.
 
మరికొన్ని నెలల పాటు భక్తులను ఆలయంలోకి అనుమతించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఒడిశా హైకోర్టుకు ఇప్పటికే ఈ మేరకు నివేదిక అందింది. 822 మంది ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 400 మంది కరోనా బారిన పడినట్టు తేలింది.

telugudesk

Recent Posts

పెళ్లి రోజే విషాదం.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లి తిరిగి రాని వధువు

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…

3 hours ago

రిజెక్ట్ చేశారని కుంగిపోకండి.. పూరి జగన్నాథ్ సూపర్ మెసేజ్ వైరల్

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…

3 hours ago

కేసుతో విసిగిపోయిన జడ్జి.. 2046కి వాయిదా! తర్వాత షాకింగ్ ట్విస్ట్

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…

3 hours ago

కొబ్బరికాయ కుళ్లిపోయింది.. సినిమా ఆగిపోయింది! బాలయ్య మూవీపై సముద్ర షాకింగ్ కామెంట్స్

దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…

3 hours ago

‘హనుమాన్’ మిస్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు పశ్చాత్తాపం!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…

3 hours ago

తల్లి కోసం తండ్రిని చంపిన కుమారుడు.. కడపలో షాకింగ్ ఘటన!

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…

3 hours ago