ప్రస్తుతమున్న ఉరుకులు పరుగుల ప్రపంచంలో సరైన తిండి చేయటానికి,తినడానికి కూడా సమయం లేకుండా ఉంది. అలాంటి వారు ఆన్ లైన్ ద్వారా తమకు కావాల్సిన ఆహారాన్ని, వారు ఉన్న చోటకి ఆర్డర్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో కామన్ అయింది. ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య ఎక్కువ అవడంతో పలు సంస్థలు కూడా ఆన్ లైన్ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారా మనం ఎంత ఫుడ్ ఆర్డర్ చేస్తే అంత మాత్రమే మనకి డెలివరీ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వింత సంఘటన ఏర్పడింది. ఒక అమ్మాయి ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే ఏకంగా 42 మంది డెలివరీ బాయ్స్ ఆమె ఇంటికి చేరుకొని ఫుడ్ డెలివరీ చేశారు. ఈ విచిత్ర సంఘటన ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది.
ఫిలిప్పీన్స్లోని సెబూ సిటీలో స్కూలులో ఓ అమ్మాయి తనకు ఇష్టమైన ఫుడ్ తినాలనిపించి ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసింది. అయితే ఆర్డర్ చేసి ఫుడ్ కోసం తనతో పాటు తన నాయనమ్మ కూడా ఎదురు చూడసాగారు. ఇంతలోనే ఆమె ఉంటున్న ప్రాంతానికి ఒక్కొక్కరుగా మొత్తం 42 మంది చొప్పున డెలివరీ బాయ్స్ ఫుడ్ తీసుకొని ఆమె ఇంటికి చేరారు.
ఒక్క ఫుడ్ ఆర్డర్ చేస్తే ఏకంగా 42 మంది డెలివరీ చేయడంతో ఆ ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒకేసారి 42 మంది డెలివరీ బాయ్స్ ఫుడ్ తీసుకొని రావడంతో అక్కడున్న వారు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఓ వ్యక్తి ఈ సంఘటనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అతికొద్ది సమయంలోనే ఈ సంఘటన ఎంతో వైరల్ గా మారింది.
ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే 40 మంది రావడానికి గల కారణం ఏమిటని ఆరా తీయగా, ఫుడ్ ఆర్డర్ చేసే యాప్ లో కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ఇలా జరిగినట్లు తెలిపారు ఒక డెలివరీ బాయ్ కి చేరాల్సిన ఆర్డర్ సాంకేతిక లోపం వల్ల ఏకంగా 42 మందికి ఆర్డర్ వెళ్లడంతో ఒకేసారి అందరూ కలిసి ఆ అమ్మాయికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…