తన కుమార్తె పుట్టిన రోజున ఓ మాజీ జర్నలిస్టు గ్రాండ్ గా చేద్దామని అనుకుంది. అనుకున్నట్లుగానే వాళ్ల ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్ లో టేబుల్ ను బుక్ చేశారు. అయితే పుట్టిన రోజు రానే వచ్చింది. లోపలికి వెళ్లేందుకు అందరినీ అనుమతించిన రెస్టారెంట్ సిబ్బంది.. ఆమెను మాత్రం అనుమతించలేదు. ఎందుకో తెలుసా.. ఆమె చీరకట్టుకున్నందుకు.
అసలేం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఖేల్ గావ్ లో మాజీ జర్నలిస్టు అనితా చౌదరి వారి కుటుంబసభ్యులు కలిసి ఉంటున్నారు. ఓ రోజు తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఖేల్ గావ్ లోనే ఆక్విలా అనే రెస్టారెంట్ లో ఓ టేబుల్ ను బుక్ చేశారు. ఆ రెస్టారెంట్ లోకి అందరిని అనుమతించిన రెస్టారెంట్ సిబ్బంది అనితాను మాత్రం అనుమతించలేదు.
ఆమె చీర కట్టుకొని ఉందని.. రెస్టారెంట్లోకి కేవలం స్మార్ట్ క్యాజువల్స్ వేసుకున్న వారికే అనుమతి ఉందని చెప్పారు. దీంతో ఆమె వారికి ఇది కూడా క్యాజువల్స్ యేగా అంటూ చెప్పుకొచ్చారు అనితా మరియు ఆమె కూతురు. అయినా వాళ్లు వినిపించుకోలేదు. వాళ్ల మేనేజర్ కూడా సిబ్బందికే సపోర్టు పలికారు. దీంతో వాళ్లు పుట్టిన రోజు వేడుకను చేసుకోకుండానే ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఈ మొత్తం వివాదాన్ని వీడియో తీసిన ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. చీర స్మార్ట్ క్యాజువల్ కాదని తనను రెస్టారెంట్లోకి అనుమతించలేదని, దీని వల్ల తన కుమార్తె పుట్టినరోజు ప్రోగ్రాం చెడిపోయిందని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆక్విలా రెస్టారెంటుపై మండిపడుతున్నారు. నటి రిచా చద్దా కూడా ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…