Aacharya : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా స్టార్ చిరంజీవి తొలిసారి కలిసి నటించిన ఫుల్ లెన్త్ చిత్రం ఆచార్య. ఈ సినిమా మెగా అభిమానులకు ఒక పీడకల. ఈ సినిమా గురించి మొదట్లో కొరటాల, చిరు కాంబినేషన్ అనగానే బాగా అంచనాలు ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా పూర్తవడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టడం, కథలో మార్పులు, చిరుకి హీరోయిన్ లేకపోవడం వంటి విషయాలు సినిమాపై నెగెటివ్ ప్రభావాన్ని చూపాయి.
ఇక పాన్ ఇండియా సినిమా జమానాలో విడుదల అవ్వడం, సినిమా కథలో అనేక మార్పులు ఇవన్నీ కలిపి ఆచార్య సినిమాకు మరీ ఘోరంగా మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక ఆచార్య సినిమా బయ్యర్స్ కి నష్టాలను మిగిల్చింది. కొరటాలకు మొదటి ఓటమిని అందించింది. ఇక ఈ సినిమా ఇపుడు ఓటీటీ లో విడుదలయి మళ్ళీ మెగా అభిమానులను బాధపెడుతోంది. ఇక ఈసినిమాలో కథానుసారం దళం లీడర్ సత్యదేవ్ చనిపోతూ తన కొడుకును యంగ్ ఆచార్యకి ఇస్తాడు. ఇక ఈ సన్నివేశం కోసం చిరంజీవిని యంగ్ ఏజ్ లో చూపించాల్సి వచ్చింది. ఇందుకోసం విఎఫ్ఎక్స్ ను వాడారు. ఈ విషయం మెగా అభిమానులకు మరింత కోపం తెప్పించింది.
ఇక విఎఫ్ఎక్స్ కు మహేష్ కి సంబంధం…..
ఈ సినిమాలో సిద్ధా పాత్రకోసం మొదట అనుకున్నది మహేష్ బాబుని. మహేష్ బాబుకి ఆ పాత్ర నచ్చలేదట కానీ కొరటాల పై ఉన్న అభిమానంతో నో చెప్పలేక పోయారట. ఇక రామ్ చరణ్ ను యంగ్ ఆచార్య పాత్రకు అనుకున్నారట. అది కాక మహేష్ కి 30 కోట్ల పారితోషకం కూడా ఆఫర్ చేశారట నిర్మాతలు. 15నిమిషాల నిడివి గళ పాత్రకోసం అంత పారితోషకం ఆఫర్ చేసినా మహేష్ నో చెప్పలేక సైలెంట్ అయ్యారట. అయితే ఈ గ్యాప్ లో చిరు, సిద్ధా పాత్రకోసం చరణ్ ను ప్రపోజ్ చేశారట. అంతే పారితోషకాన్ని ఫైనల్ చేసి పాత్ర నిడివిని పెంచాలని సూచించారట. ఇక సిద్ధా పాత్ర 15 నిమిషాల నుండి 45 నిమిషాలకి పెంచారు. ఇక యంగ్ చిరు పాత్ర కోసం విఎఫ్ఎక్స్ ను వాడారు. అది కాస్త వికటించింది. అయినా యంగ్ చిరు పాత్ర కోసం మెగా కాంపౌండ్ లోని హీరోల్లో ఎవరో ఒకరిని తీసుకుని ఉంటే సరిపోయేది కదా…
ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…
వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…
ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాచి…
తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేపిన అంశం కవిత వ్యాఖ్యలు. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయంగా మరో దశలోకి…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఓటములతో జట్టు…
నేటి కాలంలో రక్తహీనత సమస్య చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. శరీరంలో హీమోగ్లోబిన్…