Acharya Twitter Review : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా నేపద్యంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈరోజు (ఏప్రిల్ 29) న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
నక్సలిజం ఆవేశం తో కూడిన వ్యక్తి టెంపుల్ టౌన్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అన్నది సినిమా కథగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మొదటిసారిగా చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో కలిసి నటించడం, ఆర్ఆర్ఆర్ అద్బుత విజయం తరువాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇదే కావడంతో ఆచార్య సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో విదులైన పాటలు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. మరోవైపు ప్రమోషన్లు కూడా భారీగానే చేశారు. ఈ నేపధ్యంలో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.
ఇప్పటికే ఓవర్సీస్ లో పలు చోట్ల షోలు పడిపోవడంతో అక్కడ సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ఎలా ఉందో వారి అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందని, పెద్దగా ఎలివేషన్స్, హైప్ ఇచ్చే సీన్స్ ఏమీ లేవని,. అయితే మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని సెకండ్ హాఫ్ లో ఉన్నాయని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉందంటున్నారు.
“#Acharya ఫస్ట్ హాఫ్ చూసాక చాలా రోజుల తర్వాత ఒక ప్రసాంతమయిన ఫీలింగ్.. అరుపులు కేకలు మోషన్స్ రావటనట్టు ఎక్స్ప్రెషన్న్స్ ఏమి లేవు.. #ManiSharma బీజీమ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది.. North వాళ్లకు బాగా ఎక్కే అవకాశాలు వున్నాయి. అంతా దేవగట్టం గురించే” అంటూ ఒకరు కామెంట్ చేసారు. ఓవరాల్ గా సినిమా బాగుందని అంటూనే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉందంటున్నారు.. ఇంకేంటి ఆలస్యం మీరు కూడా చూసేయండి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…