Actor Brahmaji: టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు కమెడియన్ బ్రహ్మాజీ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఈయన 1986లో వచ్చిన ‘మన్నెంలో మొనగాడు’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం పలు సినిమాలలో నటిస్తున్న ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇప్పటికీ పలు సినిమాలలో సహాయ నటుడిగా కొనసాగుతున్నారు.
కెరియర్ పరంగా పలు సినిమాలు చేస్తే ఎంతో బిజీగా ఉన్న బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో కామెడీ పంచ్ లతో అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయనని ఉద్దేశిస్తూ ఓ నేటిజన్ అంకుల్ అంటూ కామెంట్ చేశారు.ఇలా తనని అంకుల్ అనడంతో రెచ్చిపోయిన బ్రహ్మాజీ అంకుల్ ఏంట్రా అంకుల్ అంకుల్ అంటూ ఏజ్…బాడీ షేమింగ్ చేస్తే కేసు వేస్తా అంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.
ఈ విధంగా బ్రహ్మాజీ తన అభిమానికి సీరియస్ గా కాకుండా సరదాగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బ్రహ్మాజీ చేసిన ఈ కామెంట్ పై మరొక నెటిజన్ స్పందిస్తూ మీరు ఎన్ని కేసులు వేసిన పలానా ఆంటీకి వచ్చినంత అటెన్షన్ మీకు రాదు .. వేసేయండి కేసు వేసేయండి లేదంటే స్వీట్ సిక్స్టీన్ బ్రహ్మాజీ గారిని పట్టుకొని అంకుల్ అంటారా.. అంకుల్! అంటూ మరొక నేటిజన్ కామెంట్ చేశారు.
ఈ విధంగా అంకుల్ అనే కామెంట్ పై బ్రహ్మాజీ ఈ విధంగా రియాక్ట్ కావడంతో ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే బ్రహ్మాజీ తనని అంకుల్ అన్నప్పటికీ ఆయన ఈ విషయాన్ని ఎంతో సరదాగా తీసుకున్నారు అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆంటీ అనే పదం ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో కొందరు నెటిజన్లు బ్రహ్మాజీని ఉద్దేశిస్తూ అంకుల్ అని కామెంట్ చేయడం గమనార్హం.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…