Vijay Sethupathi: కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు విజయ్ సేతుపతి. ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అనంతరం విలన్ గా మెప్పించారు. అలా హీరోగా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక పాత్ర కథ డిమాండ్ చేస్తే ఈయన విలన్ పాత్రలలో నటించడానికి కూడా వెనకాడటం లేదు.
తాజాగా వచ్చిన విక్రమ్ సినిమాలో ఈయన నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈయన తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. మాస్టర్ ఉప్పెన సినిమాలలో ఈయన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా సందడి చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నయనతార జంటగా తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్.
ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం అట్లీ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 21 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా రెమ్యూనరేషన్ గురించి వార్తలు విన్న నేటిజెన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో హీరోగా నటిస్తేనే ఈయన 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక విలన్ పాత్రలో అంటే తప్పనిసరిగా రెమ్యునరేషన్ తగ్గుతుంది.ఉప్పెన సినిమాలో నటించినందుకుగాను ఈయనకు ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఉన్న కష్ట పరిస్థితులలో విజయ్ సేతుపతికి ఏకంగా 21 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారంటే ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని పలువురు భావిస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…