Vijay Sethupathi: కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు విజయ్ సేతుపతి. ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అనంతరం విలన్ గా మెప్పించారు. అలా హీరోగా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక పాత్ర కథ డిమాండ్ చేస్తే ఈయన విలన్ పాత్రలలో నటించడానికి కూడా వెనకాడటం లేదు.
తాజాగా వచ్చిన విక్రమ్ సినిమాలో ఈయన నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈయన తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. మాస్టర్ ఉప్పెన సినిమాలలో ఈయన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా సందడి చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నయనతార జంటగా తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్.
ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం అట్లీ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 21 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా రెమ్యూనరేషన్ గురించి వార్తలు విన్న నేటిజెన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో హీరోగా నటిస్తేనే ఈయన 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక విలన్ పాత్రలో అంటే తప్పనిసరిగా రెమ్యునరేషన్ తగ్గుతుంది.ఉప్పెన సినిమాలో నటించినందుకుగాను ఈయనకు ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఉన్న కష్ట పరిస్థితులలో విజయ్ సేతుపతికి ఏకంగా 21 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారంటే ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని పలువురు భావిస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…