Actor Naresh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అనే విషయానికి వస్తే అది పవిత్ర నరేష్ నాల్గవ వివాహం అని చెప్పాలి. ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ ఆరు పదుల వయసులో మరొక నటి పవిత్ర లొకేషన్ వివాహం చేసుకోబోతున్నానని అధికారికంగా వెల్లడించారు.అయితే ఇప్పటికే ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి విడాకులు ఇవ్వడం గమనార్హం.
ఇకపోతే నరేష్ పవిత్ర ఇద్దరూ సహజీవనం చేస్తున్న సమయంలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలోనే నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మరొక మహిళతో ఎలా అక్రమ సంబంధం పెట్టుకొని తనని పెళ్లి చేసుకుంటాడని పెద్ద ఎత్తున వివాదం సృష్టించింది. అయితే ప్రస్తుతం వీరిద్దరికి విడాకులు మంజూరు అవడంతోనే నరేష్ నాలుగో పెళ్లి గురించి ప్రకటించారని తెలుస్తుంది.
ఇలా రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చిన అనంతరం నరేష్ తనకు భరణం కింద మొత్తంలో చెల్లించారనే విషయం గురించి ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం నరేష్ రమ్య రఘుపతికి ఐదు కోట్ల రూపాయల భరణం చెల్లించినట్లు సమాచారం.
నరేష్ తన తల్లి విజయ్ నిర్మల నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తిని అందుకున్నారు.అయితే ఈయన ఆస్తిలో రమ్య రఘుపతి కుమారుడికి వాటా ఉంటుందని అయితే ఈమెకు మాత్రం భరణం కింద 5 కోట్ల రూపాయలు చెల్లించారని వార్తలు వస్తున్నాయి.రమ్య రఘుపతి నరేష్ పవిత్ర వ్యవహారంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తుంది. అయితే ఈమె ఐదు కోట్ల రూపాయల తీసుకొని విడాకులు ఇవ్వడానికి ఎలా కాంప్రమైజ్ అయ్యారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…