Actress Gayatri Guptha : ఐస్ క్రీం 2, ఫిదా, బంధుక్ వంటి సినిమాలలో నటించి తాజాగా దయ వెబ్ సిరీస్ లో స్వేచ్చ అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి గుప్తా అంతకు ముందు బిగ్ బాస్ తెలుగు మీద కేసులు వేసి ఫేమస్ అయింది. ఓపన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గాయత్రి తెలంగాణ సంగారెడ్డి జిల్లా, జోగిపేట్ లో జన్మించింది. ఇంట్లో నుండి బయటికి వచ్చి మొదట సాక్షి న్యూస్ ఛానెల్ లో పనిచేసిన గాయత్రీ ఆపైన సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఒపనే గా చెప్పి సెన్సేషన్ అయింది.
డిప్రెషన్ తోనే నేటి తరానికి జబ్బులు….
గాయత్రీ గుప్తా ఇండస్ట్రీ కి వచ్చి 15 సంవత్సరాలు అయినా ఇప్పటికి తాను చేసిన సినిమాలు కేవలం 20 మాత్రమే అంటూ చెప్పారు. జనాలకు గుర్తుండేలా ఒక్క సినిమాలో నటించిన అది సక్సెసే అంటూ చెప్పే ఆమె తాను చాలా ఏళ్ళుగా ఆటో ఇమ్మ్యూన్ వ్యాధి వల్ల బాధపడుతున్నట్లు తెలిపారు. చాలా మంది డాక్టర్స్ ఆయుర్వేదం, హోమియో ఇలా చాలా మంది తాను మూడేళ్ళ కంటే ఎక్కువ బతకనని చెప్పారు.
కానీ చివరికి ‘ట్రూమా హీలింగ్’ ద్వారా నాకు తెలిసిన విషయం నా డిప్రెషన్ వల్లే నాకు జబ్బు వచ్చింది అని. నా డిప్రెషన్ తగ్గితే నా జబ్బు తగ్గుతుంది. తీవ్రమైన బ్యాక్ పెయిన్ తో నేను చాలా బాధపడ్డాను ఇపుడిపుడే ట్రూమా హీలింగ్ వల్ల కొంతమంది కోలుకుంటున్నాను అంటూ చెప్పారు. చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లలతో సమయం కేటాయించి వారికి ప్రేమ అందిస్తేనే ఇలాంటి డిప్రెషన్ వంటివి ఇవి దరి చేరవు. నేటి తరాలను చూస్తే భయం వేస్తుంది. పేరెంట్స్ ఇద్దరు పని చేస్తుండటం వల్ల సెల్ ఫోన్ వాడకం పెరగడం వల్ల పిల్లలలో ఇప్ప్పటికే డిప్రెషన్ ఎక్కువవుతోంది వారికి ఇంకా ఎక్కువ విచిత్రమైన జబ్బులు వస్తాయి అంటూ చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…