సినిమాలో అవకాశాలు రావాలంటే మామూలు విషయం కాదు. దాని వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా చెప్పాలంటే హీరోయిన్ల గురించి. వాళ్లకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దొరకాలంటే.. దర్శక నిర్మాతలు చెప్పిన మాట వినాల్సిందే. లేకపోతే వారికి ఇండస్ట్రీలో మనుగడ ఉండదు. ఈ విధమైన బాధలు కేవలం వాళ్లు మాత్రమే కాదు.. సినిమాల్లో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఉంటాయి. వాళ్లకు కూడా ఎన్నో చెప్పుకోరాని సంఘటనలు ఎదురై ఉంటాయి.
క్యారెక్టర్ ఆర్టిస్టు చేయాలన్నా దర్శక నిర్మాతాలు ఏవేవో వారి నుంచి ఆశిస్తూనే ఉంటారనీ గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి పవిత్రా లోకేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆమె సినిమాలో అమ్మగా, వదినగా పలు పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలను అనుభవించినట్లు తెలుస్తోంది. మొదట్లో ఆమె కన్నడంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి హీరోయిన్ పాత్రలో నటించారు.
అయితే తనసినీ కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, తనకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు తన నుంచి కూడా ఏదో ఆశించేవారని ఎన్నో సందర్భాలలో పవిత్రా లోకేష్ తెలియజేశారు. విచిత్రం ఏంటంటే.. సినిమాలో తనకు అవకాశం ఇద్దామని వచ్చేవారిని చూసి ఆమె ఎంతగానో భయపడ్డట్లు ఆమె ఇంటర్వ్యూ లో చెప్పారు. దీనిని బట్టి చూస్తేనే తెలుస్తోంది ఆమె ఎన్ని కష్టాలను అనుభవించారో అని.
సినిమాలో అవకాశాలు రావాలని చాలామంది కోరుకుంటారు.. కానీ మంచి అవకాశాలు రావాలంటే మనం కూడా వారికి అవకాశాలు ఇవ్వాల్సిందేనని నటి పవిత్రా చెప్పుకొచ్చారు. ఒక హీరో తనని వాడుకొని వదిలేశారని.. ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ఆ పూర్తి వివరాలను మాత్రం ఆమె చెప్పలేదు. అయితే ఆ నటుడు తమిళంలో స్టార్ హీరో అని.. ప్రస్తుతం కమెడియన్ గా చేస్తున్నారనే క్లూ మాత్రం ఆమె ఇచ్చింది. ఇలా ఆమె సినిమాలోకి వచ్చే ముందు జరిగిన ఘటన గురించి చెప్పారు.
అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే యువతలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. సాధారణ జీవితానికి భిన్నంగా ఉత్కంఠభరిత అనుభూతిని ఆస్వాదించాలనే కోరికతో వేలాది…
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…