సినిమాల్లో హీరోలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో విలన్లకు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు దర్శక నిర్మాతలు. ఎంత మంచి స్టోరీ ఉన్నా హీరోకు తగ్గ విలన్ లేకపోతే ప్రేక్షకులలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అందులో విలన్ పాత్రను ఎంచుకునే సమయంలో కూడా వారు ఆచీతూచి అడుగులు వేస్తుంటారు. అయితే అలాంటి విలన్ పాత్రల్లో కరెక్ట్ గా సూట్ అయ్యే వ్యక్తి ‘భిక్షుయాదవ్’. కానీ అతడి పేరు ఏంటంటే.. ప్రదీప్ రావత్.
సినిమాలో మాత్రం అతడి పేరు అలా స్థిరపడిపోయింది. సినిమా ఇండస్ట్రీలో విలన్ గా అతడు మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అతడు మొదట్లో మోడల్ గా చేసి.. తర్వాత బాలీవుడ్ లో బుల్లితెరపై వచ్చిన మహాభారతంలో అశ్వద్ధామగా నటించారు. ఆ తర్వాత అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లగాన్ లో మంచి పాత్ర చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత తమిళంలో వచ్చిన గజినీలో నటించి అటు తమిళం, ఇటు తెలుగు ఆడియన్స్ కు చాలా దగ్గర అయ్యారు.
తర్వాత తెలుగులో సై, భద్ర, చత్రపతి, లక్ష్మి, స్టాలిన్, జై లవకుశ, జగడం, వన్ నేను ఒక్కడినే లాంటి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. అతడు నేను శైలజ సనిమాలో కమెడియన్ గా కూడా నటించి అలరించాడు. అతడు మొదట్లో హీరోగా కూడా చేశారంట. కానీ అవి రిలీజ్ కాలేదు. లేదంటే ప్రదీప్ రావత్ హీరోగా పరిచయం అయ్యేవారు. ఇదిలా ఉండగా.. అతడి భార్య కళ్యాణి రావత్ కూడా మొదట్లో మోడలింగ్ చేస్తూ తర్వాత యాడ్ ఫిలిమ్స్ చేసేవారంట. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో బుల్లితెరపై నటిస్తున్నారు. ఆమె చూడటానికి అచ్చం హీరోయిన్ లా కనపడతారు.
విలన్ గా ప్రదీప్ రావత్ ను చూసిన జనాలు.. అతడి భార్య కల్యాణి రావత్ అంటే జనాలు నమ్మడం లేదు. ఎప్పుడూ విలన్ పాత్రలు వేస్తూ చూడటానికి భయంకరంగా ఉండే ప్రదీప్ రావత్ కు హీరోయిన్ లా ఉండే అమ్మాయి భార్య కావడం ఏంటని.. అందరూ అనుకుంటున్నారు. అయితే ప్రదీప్ రావత్ సినిమాలో చూపించనంత బ్యాడ్ గా నిజ జీవితంలో ప్రవర్తించరు. ఎవరైనా సహాయం చేయమని అతడి వద్దకు వస్తే తనకు తోచినంత సహాయం చేసే గొప్ప మనస్సున్న వ్యక్తి ప్రదీప్ రావత్ అంటూ కొందరు చెబుతూ ఉంటారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…