Actress Pavitra Lokesh: ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో అక్కా, అత్త, తల్లి వంటి పాత్రలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న పవిత్ర లోకేష్ కొంతకాలంగా నటుడు వి కే నరేష్ తో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపించడంతో తొందర్లోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ప్రస్తుతం వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూ ఇయర్ సందర్భంగా ఒక లిప్ లాక్ వీడియో షేర్ చేస్తూ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి స్పందిస్తూ పవిత్ర లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఇద్దరి పెళ్లి జరగనివ్వనని సవాల్ చేసింది. అయితే పవిత్ర, నరేష్ పెళ్లి జరిగే అవకాశాలు లేవని కొంతమంది ప్రమాదం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన నరేష్ పవిత్రని నాలుగవ పెళ్లి చేసుకుంటాడని గ్యారెంటీ లేదు. అంతేకాకుండా గతంలో రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నప్పుడు నరేష్ ఆమె గురించి చాలా గొప్పగా చెప్పాడు.
ఇప్పుడు పవిత్రతో పెళ్లికి రమ్య అడ్డుపడటంతో ప్రెస్ మీట్ ఆమె గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. అంతే కాకుండా పవిత్ర మాటలపై కూడా ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో తన భర్త గురించి ఎంతో గొప్పగా పొగిడిన పవిత్ర ఇప్పుడు అతనికి విడాకులు ఇచ్చి నరేశ్ ని వివాహం చేసుకోవటానికి సిద్దమైంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర తన భర్త సుచేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడుతూ…’ సీరియల్లో కలిసి నటించినప్పుడు మా మధ్య ఏర్పడిన బంధం స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలియదు గానీ.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానంతో పెళ్లి చేసుకున్నాం. సుచేంద్ర ప్రసాద్ నాకన్నా చాలా గొప్ప వ్యక్తి నాతో కంపేర్ చేసుకుంటే ఆయనలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఆయనకు నేనంటే చాలా అభిమానం. నా అభిప్రాయాలను కూడా ఎంతో గౌరవిస్తారు. ఇప్పటి వరకు ఆయనలో ఒక్క లోపాన్ని కూడా చూడలేదు. నా విషయంలో ఆయన చాలా పొసేసివ్, నేను ఆయనకే సొంతమని భావిస్తారు. అందుకే, నా సినిమాలు కూడా చూసేవారు కాదు. ఇలా మాజీ భర్త గురించి చెబుతూ పొగడ్తలతో ముంచేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…