Aishwary Rajinikanth: ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో గత కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున దొంగతనం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె ఇంట్లో దొంగతనం జరగడమే కాకుండా పెద్ద ఎత్తున బంగారు వజ్రాభరణాలు దొంగతనం చేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే తన ఇంట్లో లాకర్ కీస్ ఎక్కడ పెడతాననే విషయం ఇంట్లో పనివారికి తెలుసు అని చెప్పిన ఐశ్వర్య పనివారిని అనుమానిస్తున్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఐశ్వర్య రజనీకాంత్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె పనిమనిషి ఈశ్వరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో భాగంగా ఈశ్వరి పలు విషయాలను తెలియజేశారు.తనకు ఇప్పటికే సిటీలో రెండు ఇల్లు ఉన్నాయని దొంగతనం చేయాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని తెలిపారు. అయితే పోలీసులు తమ స్టైల్ లో విచారించగా ఈమె అసలు విషయం బయట పెట్టింది.
ఇక ఈమె చెప్పిన విషయాలు విన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో తానే దొంగతనం చేశానని తెలిపారు.అయితే తాను దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్య రజనీకాంత్ అని పనిమనిషి ఈశ్వరి చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా గొడ్డులా చాకరీ చేస్తున్నాను అయినప్పటికీ తన జీతం మాత్రం కేవలం 30 వేల రూపాయలు మాత్రమే ఇస్తుందని ఈ డబ్బు తనకు ఏమాత్రం సరిపోలేదు అంటూ అందుకే దొంగతనం చేసానని తెలిపారు.
ఇకపోతే ఈశ్వరి ఇంట్లో ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం చేసిన బంగారం కన్నా అధిక బంగారం లభించడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఐశ్వర్య రజినీకాంత్ 60 సవర్ల బంగారం పోగా తన ఇంట్లో మాత్రం ఏకంగా 100 సవర్ల బంగారం నాలుగు కిలోల వెండి 30 గ్రాముల వజ్రాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ నగలన్నీ తనకు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో ఆమెను విచారిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…