Aishwary Rajinikanth: ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో గత కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున దొంగతనం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె ఇంట్లో దొంగతనం జరగడమే కాకుండా పెద్ద ఎత్తున బంగారు వజ్రాభరణాలు దొంగతనం చేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే తన ఇంట్లో లాకర్ కీస్ ఎక్కడ పెడతాననే విషయం ఇంట్లో పనివారికి తెలుసు అని చెప్పిన ఐశ్వర్య పనివారిని అనుమానిస్తున్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఐశ్వర్య రజనీకాంత్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె పనిమనిషి ఈశ్వరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో భాగంగా ఈశ్వరి పలు విషయాలను తెలియజేశారు.తనకు ఇప్పటికే సిటీలో రెండు ఇల్లు ఉన్నాయని దొంగతనం చేయాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని తెలిపారు. అయితే పోలీసులు తమ స్టైల్ లో విచారించగా ఈమె అసలు విషయం బయట పెట్టింది.
ఇక ఈమె చెప్పిన విషయాలు విన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో తానే దొంగతనం చేశానని తెలిపారు.అయితే తాను దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్య రజనీకాంత్ అని పనిమనిషి ఈశ్వరి చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా గొడ్డులా చాకరీ చేస్తున్నాను అయినప్పటికీ తన జీతం మాత్రం కేవలం 30 వేల రూపాయలు మాత్రమే ఇస్తుందని ఈ డబ్బు తనకు ఏమాత్రం సరిపోలేదు అంటూ అందుకే దొంగతనం చేసానని తెలిపారు.
ఇకపోతే ఈశ్వరి ఇంట్లో ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం చేసిన బంగారం కన్నా అధిక బంగారం లభించడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఐశ్వర్య రజినీకాంత్ 60 సవర్ల బంగారం పోగా తన ఇంట్లో మాత్రం ఏకంగా 100 సవర్ల బంగారం నాలుగు కిలోల వెండి 30 గ్రాముల వజ్రాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ నగలన్నీ తనకు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో ఆమెను విచారిస్తున్నారు.
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…