Allu Aravind:తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఎలాంటి మంచి అనుబంధం ఉందో మనకు తెలిసిందే. చిరంజీవి అల్లు అరవింద్ ఇద్దరు వరుసకు బావ బావమరిది అయినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో మంచి అన్యోన్యత ఉండేది. ఏ చిన్న వేడుక జరిగిన మెగా అల్లు కుటుంబం ఒకే చోట చేరి పెద్ద ఎత్తున ఆ వేడుకను జరుపుకునే వారు.
ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ క్రమక్రమంగా మెగాస్టార్ చిరంజీవిని దూరం పెడుతూ నందమూరి నటసింహం బాలకృష్ణకు దగ్గర అవుతున్నారని వార్తలు వినపడుతున్నాయి.
ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా అల్లు అరవింద్ వ్యవహార శైలి చూస్తే అందరికీ ఇది నిజమేనని అర్థమవుతుంది. అల్లు అరవింద్ ఆహా సమస్థను స్థాపించి ఇందులో అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బాలయ్యను తీసుకువచ్చారు. ఇలా ఈ కార్యక్రమంతో వీరి బంధం బలపడింది.ఇక గతంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా వెళ్లారు.
ఇకపోతే అల్లు అరవింద్ త్వరలోనే తన బ్యానర్ లో బాలకృష్ణ చేత ఓ సినిమా చేయనున్నారని వార్తలు కూడా ఇండస్ట్రీలో వినపడుతున్నాయి.ఇకపోతే అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం బాలకృష్ణ ముఖ్యఅతిథిగా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా అల్లు అరవింద్ చిరంజీవిని దూరం పెడుతూ బాలకృష్ణకు దగ్గర అవుతున్నారని తెలుస్తోంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…