Allu Aravind: బాలయ్యకు దగ్గరవుతూ చిరుని పక్కన పెడుతున్న అల్లు అరవింద్.. ఒంటరవుతున్న చిరు?

Allu Aravind:తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఎలాంటి మంచి అనుబంధం ఉందో మనకు తెలిసిందే. చిరంజీవి అల్లు అరవింద్ ఇద్దరు వరుసకు బావ బావమరిది అయినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో మంచి అన్యోన్యత ఉండేది. ఏ చిన్న వేడుక జరిగిన మెగా అల్లు కుటుంబం ఒకే చోట చేరి పెద్ద ఎత్తున ఆ వేడుకను జరుపుకునే వారు.

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ క్రమక్రమంగా మెగాస్టార్ చిరంజీవిని దూరం పెడుతూ నందమూరి నటసింహం బాలకృష్ణకు దగ్గర అవుతున్నారని వార్తలు వినపడుతున్నాయి.

ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా అల్లు అరవింద్ వ్యవహార శైలి చూస్తే అందరికీ ఇది నిజమేనని అర్థమవుతుంది. అల్లు అరవింద్ ఆహా సమస్థను స్థాపించి ఇందులో అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బాలయ్యను తీసుకువచ్చారు. ఇలా ఈ కార్యక్రమంతో వీరి బంధం బలపడింది.ఇక గతంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా వెళ్లారు.

Allu Aravind: బాలయ్యకు దగ్గరవుతున్న అల్లు అరవింద్…

ఇకపోతే అల్లు అరవింద్ త్వరలోనే తన బ్యానర్ లో బాలకృష్ణ చేత ఓ సినిమా చేయనున్నారని వార్తలు కూడా ఇండస్ట్రీలో వినపడుతున్నాయి.ఇకపోతే అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం బాలకృష్ణ ముఖ్యఅతిథిగా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా అల్లు అరవింద్ చిరంజీవిని దూరం పెడుతూ బాలకృష్ణకు దగ్గర అవుతున్నారని తెలుస్తోంది.