Allu Aravind: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అరవింద్ ఈ మధ్యకాలంలో నందమూరి నటసింహం బాలకృష్ణతో ఎంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ బాలయ్యను ఏకంగా అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తీసుకువచ్చారు. అదేవిధంగా తన కుమారుడు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతారని తనతో ఐదు నిమిషాలలో పని పూర్తవుతుందని తెలిపారు.అన్ స్టాపబుల్ కోసం తనకు ఫోన్ చేసి మీరు వ్యాఖ్యతగా ఉండాలి అని అడిగాను. వెంటనే టీం పంపించండి అని చెప్పారు.ఇలా తన టీం వెళ్లి అన్ని వివరించిన తర్వాత ఓకే తనకు టీం నచ్చింది మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం అని ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఓకే చెప్పారు.
ఇక శిరీష్ సినిమా వేడుక కోసం బాలయ్యను ఆహ్వానించగా మన శిరీష్ కదా తప్పకుండా వస్తా అంటూ ఈ సినిమా వేడుకకు వచ్చారని అల్లు అరవింద్ వెల్లడించారు. ఈయన ఏ విషయాన్ని దాచుకోరని ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతారని , ఆయనకు స్టార్ హీరో అనే అహం లేదంటూ అరవింద్ పేర్కొన్నారు.
ఈ విధంగా సింపుల్ యాటిట్యూడ్ చూపించే బాలకృష్ణకు అందరూ అభిమానులే అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేస్తున్నటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్,బాలకృష్ణ మధ్య మంచి రిలేషన్ ఏర్పడటంతో గీతా ఆర్ట్స్ బ్యానర్లు బాలయ్యతో సినిమా చేయడానికి అల్లు అరవింద్ కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…