Amithab Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన తన అభిమానుల కోసం గత 50 సంవత్సరాలుగా ఒక పని తప్పకుండా చేస్తున్నారని తెలుస్తుంది.
సాధారణంగా అభిమాన హీరోలను చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు వారి ఇంటి ముందు పడిగాపులు కాస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఆదివారం అమితాబ్ ఇంటి ముందు ఎంతోమంది అభిమానులు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారట. ఇలా తనకోసం వచ్చిన వారిని కలవడం కోసం అమితాబ్ ప్రతి ఆదివారం ఉదయం తన బాల్కనీలో కొంత సమయం పాటు అభిమానుల కోసం కేటాయిస్తారని తెలుస్తోంది.
ఈ ఆచారం గత 50 సంవత్సరాలుగా కొనసాగుతుందని తెలియజేశారు. అయితే ఆయన ఏదైనా సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ముంబైలో లేకపోయినా ఈ విషయాన్ని రెండు రోజులు ముందుగానే తెలియజేస్తారట. ఇక ఆదివారం ఉదయం బాల్కనీలో కొంత సమయం పాటు ఉండి అక్కడికి వచ్చినటువంటి అభిమానులకు నమస్కారం చేయడమే కాకుండా వారితో కాసేపు ముచ్చటిస్తారని తెలుస్తోంది.
ఈ విధంగా 50 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం అభిమానుల కోసం కొంత సమయం కేటాయించడమే కాకుండా వారిని కలిసే సమయంలో అమితాబ్ చెప్పులు కూడా వేసుకోరని తెలుస్తోంది. ప్రేక్షకులు తమకు దేవుళ్ళతో సమానమని భావించిన అమితాబ్ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే చెప్పులు వేసుకోమో అలాగే ప్రేక్షక దేవుళ్లను చూసేటప్పుడు కూడా చెప్పులు వేసుకోకూడదన్న భావనలో ఆయన చెప్పులు లేకుండా అభిమానులతో మాట్లాడతారని తెలిసి అమితాబ్ ప్రేక్షకులకు ఇచ్చే గౌరవ మర్యాదలపై నేటిజన్స్ ఫిదా అవుతున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…