Analists Dasari Vignan & Damu Balaji : సోషల్ మీడియా మొత్తం ఒకటే చర్చ నడుస్తోంది అది మంచు మనోజ్ పెళ్లి. మంచు మనోజ్ తన రెండవ వివాహం అందరూ అనుకున్నట్లుగానే దివంగత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక రెడ్డిని చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి గురించి అనేక విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మంచు మనోజ్ పెళ్లి గురించి కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయం గురించి అనలిస్ట్స్ దాసరి విజ్ఞాన్ అలాగే దాము బాలాజీ మాట్లాడారు.
మోహన్ బాబుకి ఇష్టం లేదు అందుకే పెళ్లి అక్కడ…
మోహన్ బాబు గారికి మంచు మనోజ్ మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ దాసరి విజ్ఞాన్, దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. మొదటగా వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు కూడా మోహన్ బాబు గారికి ఇష్టం లేకపోవడం వల్లే వాళ్ళ పెళ్లి జరగలేదని చెప్పారు. విష్ణు విషయంలో కూడా నచ్చక పోయినా కుటుంబం మొత్తం ఒక్కటై ఒప్పించారట. ఇక మనోజ్ విషయంలో అసలు ఒప్పుకోలేదట మోహన్ బాబు కానీ విష్ణు భార్య వెరోనిక స్నేహితురాలు బంధువు అవ్వడం వల్ల చేసుకోవాలని అనుకున్నపుడు ఇక ఒప్పుకున్నారట. వేరే కులం వాళ్లనే కొడుకులు పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి నచ్చలేదని అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడు రెండో వివాహం అప్పుడు కూడా ఆయనకు పూర్తిగా ఇష్టంలేదని కానీ ఒప్పుకున్నారంటూ టాక్ వినిపిస్తోందని చెప్పారు.
ప్రణీత రెడ్డిని వివాహాం చేసుకున్న మంచు మనోజ్ ఆ తరువాత ఎక్కువ కాలం వారు కలిసి లేరు విడిపోయారు. విడిపోయాక మంచు మనోజ్ కుటుంబానికి కూడా దూరం జరిగాడు. మోహన్ బాబు గారు కొత్త ఇల్లు కట్టించుకుని సిటీ కి దూరంగా ఉండగా మంచు మనోజ్ సపరేట్ ఇంట్లో ఫిల్మ్ నగర్ లోనే ఉంటున్నాడు. ఇక సినిమాల పరంగా కూడా మనోజ్ కి సపోర్ట్ లేదంటూ దాసరి విజ్ఞాన్, దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. మనోజ్ నటించిన కొన్ని సినిమాలు ఫైనాన్సియల్ సమస్యల వల్ల విడుదల కాలేదని, కుటుంబంలోని వారే మనోజ్ ను పట్టించుకోలేదనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు కూడా మనోజ్ మౌనిక సెపరేట్ గానే ఉంటారని కుటుంబానికి దూరంగా ఉండవచ్చు అంటూ అభిప్రాయపడ్డారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…