Analyst Adusumilli Srinivasarao : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం ఉంది అయితే అప్పుడే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తులు, పర్యటనలు అంటూ బిజీ అయిపోయారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఖమ్మం సభలో మాట్లాడటం, అక్కడికి జనం బాగా రావడంతో తెలంగాణలో కూడా టీడీపీకి ఇంకా బలం ఉందనే విషయం అన్ని పార్టీలకు అర్థమైంది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారో తెలియదు కానీ మూడు ప్రాంతీయ పార్టీలలో ఎవరి బలం ఎంతో ప్రజలే నిర్ణయిస్తారు. అయితే టీడీపీ తరుపున ప్రచారం చేయడానికి తన తమ్ముడు ఎన్టీఆర్ వస్తాడంటూ ఇటీవల తారక రత్న చేసిన వ్వాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసాయి. ఇక ఎన్టీఆర్ నిజంగా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా లేదా అనే అంశం మీద పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు విశ్లేషించారు.
ఎన్టీఆర్ అవసరం టీడీపీ కి ఉందా…
శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ టీడీపీ రెండు రాష్ట్రాల్లోను ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అని ప్రజలు భావిస్తున్నారంటూ అభిప్రాయపడ్డారు. అటు ఏపీ లో ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ కి కలిసి రావొచ్చు. ఇక్కడ తెలంగాణ లోనూ టీడీపీ ఇంకా బ్రతికే ఉందని మొన్న ఖమ్మం సభ నిరూపించింది. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో గెలవాలని అన్ని పార్టీలూ సమాయత్తమవుతుండగా పొత్తుల గురించి చర్చలు నడుస్తున్నాయి. ఈసారి టీడీపీ వైపు ప్రజలు ఉంటే ఎవరు టీడీపీ తో కలిసి వచ్చినా రాకపోయినా ఆ పార్టీ గెలుస్తుంది.
ఇక టీడీపీకి ఎన్టీఆర్ గారి ప్రచారం అవసరమని నేను అనుకోవడం లేదు అంటూ శ్రీనివాసరావు గారు అభిప్రాయపడ్డారు. కాకపోతే చంద్రబాబు ఏ ఒక్క ఛాన్స్ వదలకూడదు అనుకుంటే ఎన్టీఆర్ ను ప్రచారానికి పిలవొచ్చు. ఒకవేళ పిలిచినా ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేస్తాడు. అది వాళ్ళ కుటుంబానికి సంబంధిచిన పార్టీ కనుక బాధ్యత ఎన్టీఆర్ కు ఉంది అంటూ అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ పార్టీ ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికలకు వినియోగించుకోవాలని అనుకుంటోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ అందుకే జరిగిందని భావిస్తున్నారు కానీ అన్నీ ఊహగానాలే కానీ ఇంకా స్పష్టత రావాలి అంటూ తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…