Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో పూటకో వార్త బయటికి వస్తున్నా అసలు నిందితులు బయటికి రావడం లేదు. అయితే సిబిఐ కావాలనే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటూ ఒకవైపు వినిపిస్తున్నా విచారణకు అవినాష్ రెడ్డి హాజరవ్వాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తరలించడం, ఆ కారణంతో సిబిఐ విచారణకు గడువు కోరడంతో అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకోడానికి కావాలనే ఇలా చేస్తున్నడంటూ విపక్షాలు విమర్శిస్తుంటే మరోవైపు వైఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉందని వైఎస్ కుటుంబ నుండి విజయమ్మ, వివేకానంద రెడ్డి చెల్లి విమలా రెడ్డి పరామర్శించారు. ఇక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన హై కోర్ట్ తీర్పును తాజాగా బుధవారం నాడు వెల్లడించింది. అయితే అంతకు నాలుగు రోజుల ముందు వాదనలు విన్న హై కోర్ట్ జడ్జి కొన్ని కామెంట్స్ చేసారు. వాటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
నా మీద ఒత్తిడి తెస్తున్నారు…
జస్టిస్ లక్ష్మణ్ గారు అవినాష్ కు బెయిల్ మంజూరు చేసే ముందు సిబిఐ వాదనలు, అలాగే సునీత తరుపు లాయర్ అలాగే అవినాష్ తరుపు లాయర్ వాదనలను విన్నారు. ఇక సిబిఐ తరుపు లాయర్ కి దాదాపు 16 ప్రశ్నలను వేయగా వాటికి సిబిఐ నుండి సరైన సమాధానం రాలేదని బాలాజీ తెలిపారు. ఆ తరువాతే ఆయన అవినాష్ కు బెయిల్ మంజూరు చేసారు. అయితే బెయిల్ కు కొన్ని షరతులు విధించారు.
కేసుకు సంబంధించిన ఎవరైనా నిందితులను ప్రభావితం చేసినా లేక సిబిఐ విచారణకు ప్రతి శనివారం హాజరు కాకపోయినా బెయిల్ రద్దుకు సిబిఐ కోర్ట్ ను ఆశ్రయించవచ్చని తెలిపారు. ఇక జస్టిస్ మీడియా గురించి మాట్లాడుతూ ఏబిఎన్ అలాగే మహా అనే మీడియా సంస్థలు నిర్వహించిన డిబేట్స్ కారణంగా తాను ఒత్తిడి గురయ్యానని నేను అమ్ముడుబోయానంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయంటూ పేర్కొన్నారు. వాటి ఫుటేజ్ ను కోర్ట్ కి ఇచ్చి పరిశీలించాలని అదేశించారంటూ బాలాజీ తెలిపారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…