Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో పొత్తులు మీదే చర్చలు జోరుగా జరుగుతుంటే ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేల ప్రతి పార్టీ తమ బలాబలాలను తెలుసుకోడానికి సర్వేలను చేస్తుంటారు. అయితే ఈ సర్వేలో వచ్చే ఫలితం కూడా ఒక్కోసారి రాజకీయంగా వాడుకోడానికి చూస్తుంటారు మన నాయకులు. తాజాగా వచ్చే ఎన్నికలలో ఈ పార్టీకి మైలేజ్ ఉంది అంటూ కొన్ని సంస్థలు సర్వేలను ఇస్తున్నాయి. వాటిలో టైమ్స్ నౌ సర్వేలో జగన్ కి తిరుగులేదని క్లీన్ స్వీపర్ దిశగా అడుగులు పడబోతున్నాయని చెప్పగా రీసెంట్ గా మరో సంస్థ ఇండియన్ టీవీ, సిఎన్ఎన్ సర్వేలో జగన్ కి అధికారానికి డోకా లేకపోయినా సీట్లు తగ్గుతాయని చెబుతోంది.
ఏ సర్వేలను నమ్మాలి…
తన ఇమేజ్ తో 151 సీట్లను ఏపీలో కొల్లగొట్టిన జగన్ ఈ సారి 175 మనవే అనడం కొంత ఓవర్ గా ఉన్నా అది మైండ్ గేమ్ అంటూ అందరూ లైట్ తీసుకుంటున్నారు. అయితే జగన్ ఇమేజ్ ను పక్కనబేడితే నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఇమేజ్ ఏమాత్రం బాగోలేదని జగన్ సొంత సర్వేలో తేలింది. అందుకే గెలిచే గుర్రాలకే టికెట్లను ఇస్తున్నట్లు మిగిలిన వారికి క్లాస్ పీకుతున్నారట సీఎం. ఇక టీడీపీ ఒకవైపు పొత్తులతో వెళ్లాలా లేదా అనే మీమాంసలో ఉన్నా తాజాగా వచ్చిన ఇండియన్ టీవీ సిఎన్ఎన్ సర్వేలో జగన్ కి వోటింగ్ శాతం తగ్గుతోందని 46% వోటింగ్ శాతం ఉన్నట్లు చెప్పగా టీడీపీ కి 38% దాకా ఉన్నట్లు చెప్పింది. ఎంపీ సీట్ల విషయానికి వస్తే 18 దాకా వైవీపీ మిగిలిన 7 టీడీపీ ఖాతాలో ఉండొచ్చని తెలిపింది.
అయితే అంతకుముందు నెల క్రితం ఇచ్చిన టైమ్స్ నౌ సర్వేలో మొత్తం ఎంపీ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పగా ఆరు శతమానం వోటింగ్ వాళ్ళు చెప్పిన దానికంటే తక్కువ ఇండియన్ టైమ్స్ సర్వే చెబుతోంది. అయితే ఈ రెండు సర్వేలలోనూ జనసేన లేకుండా వైసీపీ, టీడీపీ గురించి ఉండగా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, బీజేపీ ఎటువైపు నిలుస్తుంది వంటివి పరిగణలోకి తీసుకోలేదని, ఎవరికి అనుకూలంగా ఉన్న సర్వేలను వాళ్ళు తీసుకుంటుండగా ప్రతికూల సర్వేను ఆయన పార్టీనే చేయించుకుని జనాలతో మైండ్ గేమ్ ఆడుతోందని పార్టీలు ఆరోపిస్తున్నాయని బాలాజీ తెలిపారు.
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…