Featured

Analyst Damu Balaji : జగన్ పై అమిత్ షా దాడి… చంద్రబాబు వ్యూహం వెనుక అసలు కథ ఇదే…: అనాలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీలో చేరుతారో తెలియదు, ఏ పార్టీ మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో తెలియదు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో విజయం కోసమే అన్నట్లుగా అన్ని పార్టీలు ఎవరికి వారు వ్యూహ రచనకు పదును పెడుతూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇంతవరకు తెలంగాణలో బీజేపీ కి తెరాస కి అస్సలు పడలేదు. అధికార పార్టీ బిఆర్ఎస్ మీద బాగా ఫైర్ అయింది బీజేపీ అలాగే బీజేపీ మీద విరుచుకుపడ్డాడు గులాబీ బాస్. కానీ తాజాగా కేసీఆర్ గారు ఒక సభలో మాట్లాడుతూ బీజేపీ గురించి ఒక్క విమర్శ చేయకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే ఏపీ రాజకీయాల్లో కూడా కమలం పార్టీ తాజాగా పచ్చపార్టీ వైపు చూస్తోందని అనిపిస్తోంది. ఈ ఇష్యూ గురించి ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషించారు.

జగన్ పై అమిత్ షా విసుర్లు అందుకేనా…

ఏపీ రాజకీయాల్లో వైసీపీ పార్టీ కి మొదటి నుండి బిజెపి స్నేహపూర్వకంగానే ఉంది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు అమిత్ షా, జేపీ నడ్డ తో కలిసి ఢిల్లీ లో చర్చించిన అనంతరం ఏపీ రాజకీయాల్లో మార్పు కనిపిస్తోంది. నిజానికి టీడీపీ శ్రేణులకు బీజేపీ తో టీడీపీ కలవడం ఇష్టం లేకపోయినా ఈ ఎన్నికలు టీడీపీ కి కీలకం కావడం వల్ల చంద్రబాబు బీజేపీ తో దోస్తి కోరుకుంటున్నారు. ఒకవైపు జనసేన బీజేపీ టీడీపీ మూడు కలిసి ఈ ఎన్నికల కోసం రెడీ అవ్వొచ్చు.

అయితే టీడీపీ కి బీజేపీ అవసరం ఉంది కానీ బీజేపీ కి టీడీపీ అవసరం ఏపీ లో లేదు. జగన్ స్నేహం ఉండటం వల్ల టీడీపీ వైపు చూడాల్సిన పని లేదు అంటూ బాలాజీ తెలిపారు. అయితే తెలంగాణ లో బీజేపీ కి టీడీపీ అవసరం ఉంది. టీడీపీ క్యాడర్ అక్కడ ఇంకా బలంగా ఉండటం వల్ల ఆ ఓటు బ్యాంకు బీజేపీ కి వస్తే అధికారం లోకి వచ్చే అవకాశలు ఉన్నాయి. అందుకే ఏపీ టీడీపీ తో పొత్తుకు బీజేపీ ఒప్పుకోవచ్చు. అందుకే తాజాగా ఏపీలో బీజేపీ స్వరం మారిపోయింది. జగన్ ప్రభుత్వం మీద విమర్శలను గుప్పిస్తోంది. తాజాగా వైజాగ్ కి వచ్చిన అమిత్ షా కూడా జగన్ మీద విమర్శలను గుప్పించారు. ఇక జగన్ కూడా వాళ్లంతా కలిసినా నాది ఒంటరి పోరు అంటూ మాట్లాడుతున్నారు అని బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

15 minutes ago

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

43 minutes ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

45 minutes ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

1 hour ago

తమన్నా పిటిషన్‌కు షాక్.. హైకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…

1 hour ago

పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. వైద్య రంగంలో సంచలనం!

ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…

1 hour ago