Analyst Damu Balaji : వైసీపీ పార్టీ తీర్థం పూచ్చుకోక పోయినా ఆ పార్టీ అధికార ప్రతినిధిలాగా ఛాన్స్ వచ్చిందంటే చాలు టీడీపీ, జనసేన మీద విరుచుకుపడుతూ ట్వీట్స్ పెట్టడం, యూట్యూబ్ లో సొంత ఛానెల్ లో వీడియోస్ వదలడం ఆర్జీవి కొత్త కాలక్షేపం. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యణ్ టీడీపీ తో వచ్చే ఎన్నికలకు కలిసి వెళ్తున్నట్లు చెప్పడం, మూడు సార్లు చర్చలకు వెళ్లడంతో ఈ విషయం మీద ఘాటుగానే ఆర్జీవి స్పందించాడు. ఇక ఆర్జీవి ట్వీట్ చేసిన విషయాలకు జనసైనికుల నుండి ఎలాంటి విమర్శలు ఎదురావుతాయో చూడాలి. అయితే ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
నీకంటే గాలి జనార్దన్ రెడ్డి మేలు…
పవన్ కళ్యాణ్ మీద ఆర్జీవి కామెంట్స్ చేయడం కొత్త కాదు. కావాలనే పవన్ అభిమానులను, మెగా అభిమానులను గిల్లుతుంటాడు ఆర్జీవి. అయితే తాజాగా కర్ణాటక ఎలక్షన్స్ కి ముడిపెడుతూ పవన్ ను ఆడిపోసుకున్నాడు. కర్ణాటక లో బీజేపీ నుండి బయటికి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ పెట్టి ఎంతో కాలం కాలేదు ఈ ఎన్నికలలో నలుగురిని గెలిపించుకున్నాడు. మన ఏపీలో పదేళ్ళైనా ఇంకా వేరేవాళ్లతో పొత్తు కోసం వేంపర్లాడడం సరిపోయింది. ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం లేదు, ఇంకెప్పుడు పార్టీని నిలబెట్టుకుంటావు అంటూ జనసేనాని మీద కామెంట్స్ చేసాడు ఆర్జీవి.
ఇక తన ఓటమికి జనాలను నిందించే నాయకుడు అంటూ వెటకారం చేసాడు. ఏదైనా ఒక వస్తువు అమ్ముడుపోకపోతే ఆ వస్తువు కొనని వినియోగదరుడిదే తప్పు అని ఒక కంపెనీ చెబితే ఎలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ నా ఓటమికి కారణం జనాలే అన్నపుడు అలాగే ఉంటుంది అంటూ ఆర్జీవి మాట్లాడారు. ఇక ఈ విషయం గురించి బాలాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్వతహాగా పోటీ చేసి ఉంటే అధికారంలోకి రాకపోయినా కనీసం కొన్నిసీట్లు గెలిచి పార్టీ పటిష్టం అయ్యేది. అలా కాకుండా 40 ఇచ్చినా ఒకే 30 ఇచ్చినా ఒకే అంటూ టీడీపీ వెనుక పడటం వల్ల ఇమేజ్ డామేజ్ అవుతుంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…