Featured

Analyst Damu Balaji : పోసాని షాకింగ్ కామెంట్స్… నేను చనిపోతే ముట్టుకోవద్దు…చనిపోతే బాధ్యత వారిదే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ తానేది స్వయంగా మాట్లాడరు. ఆయన మాట్లాడలనుకునే ప్రతి మాట తన నేతలతో మాట్లాడిస్తారు. అలా కొడాలి నానీ, పేర్ని నానీ, మంత్రి రోజా, అంబటి రాంబాబు, పోసాని వంటి వారు పార్టీలో కేవలం ప్రతి పక్షాలను తిట్టడానీకె పనిచేస్తున్నారు. సినిమా వాళ్ళ నుండి వచ్చే కామెంట్స్ ను తిప్పికొట్టడానికి పోసాని కృష్ణ మురళి గారిని పెట్టుకున్న జగన్ ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ ను బాగా విమర్శిస్తుంటారు. అయితే తాజాగా పోసాని చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తాను మరణిస్తే అంటూ చేసిన కామెంట్స్ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నా శవం సినిమా వాళ్లకు చూపించకండి….

పోసాని గారు ఎపుడు ప్రతిపక్షాల మీద విరుచుకు పడుతూ ఫైర్ అవుతూ ఉంటారు. కానీ తాజాగా అయన నాకు 63 ఏళ్లు ఏ క్షణమైన చనిపోవచ్చు నేను చనిపోతే నా శవం సినిమా వాళ్లకు చూపించకండి అంటూ తన కుటుంబానికి చెప్పారు. అలానే తన భార్యకు కూడ చెప్తూ తనకు మరణిస్తే బాధపడకూడదని అందరికి అన్నం పెట్టి పంపించు అంటూ చెప్పడం ఇపుడు చర్చనియంశం అయిందని బాలాజీ తెలిపారు. నిజానికి పవన్ కళ్యాణ్ మీద చేసిన వాఖ్యలకు పోసాని కుటుంబం మీద గతంలో దాడి జరిగింది. ఆయన ఇంటిని మీద రాళ్లతో దాడి చేసారు.

అయితే ఆ సమయంలో ఆయన, తన కుటుంబం తో అక్కడ లేరు. కొద్ది రోజులు రహస్యంగా ఉన్నారు. ఇక మళ్ళీ జగన్ ప్రభుత్వం 2022 లో సినిమా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చాక అయన మళ్ళీ ఆక్టివ్ అయి పవన్ మీద టీడీపీ మీద కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా చేసిన వాఖ్యలు టీడీపీ, జనసేన కు భయపడి చేసినట్లుగా అనుకోవచ్చని బాలాజీ తెలిపారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ వైసీపీ ప్రభుత్వం రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి అనే భయం వచ్చుండొచ్చు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago