Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ తానేది స్వయంగా మాట్లాడరు. ఆయన మాట్లాడలనుకునే ప్రతి మాట తన నేతలతో మాట్లాడిస్తారు. అలా కొడాలి నానీ, పేర్ని నానీ, మంత్రి రోజా, అంబటి రాంబాబు, పోసాని వంటి వారు పార్టీలో కేవలం ప్రతి పక్షాలను తిట్టడానీకె పనిచేస్తున్నారు. సినిమా వాళ్ళ నుండి వచ్చే కామెంట్స్ ను తిప్పికొట్టడానికి పోసాని కృష్ణ మురళి గారిని పెట్టుకున్న జగన్ ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ ను బాగా విమర్శిస్తుంటారు. అయితే తాజాగా పోసాని చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తాను మరణిస్తే అంటూ చేసిన కామెంట్స్ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
నా శవం సినిమా వాళ్లకు చూపించకండి….
పోసాని గారు ఎపుడు ప్రతిపక్షాల మీద విరుచుకు పడుతూ ఫైర్ అవుతూ ఉంటారు. కానీ తాజాగా అయన నాకు 63 ఏళ్లు ఏ క్షణమైన చనిపోవచ్చు నేను చనిపోతే నా శవం సినిమా వాళ్లకు చూపించకండి అంటూ తన కుటుంబానికి చెప్పారు. అలానే తన భార్యకు కూడ చెప్తూ తనకు మరణిస్తే బాధపడకూడదని అందరికి అన్నం పెట్టి పంపించు అంటూ చెప్పడం ఇపుడు చర్చనియంశం అయిందని బాలాజీ తెలిపారు. నిజానికి పవన్ కళ్యాణ్ మీద చేసిన వాఖ్యలకు పోసాని కుటుంబం మీద గతంలో దాడి జరిగింది. ఆయన ఇంటిని మీద రాళ్లతో దాడి చేసారు.
అయితే ఆ సమయంలో ఆయన, తన కుటుంబం తో అక్కడ లేరు. కొద్ది రోజులు రహస్యంగా ఉన్నారు. ఇక మళ్ళీ జగన్ ప్రభుత్వం 2022 లో సినిమా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చాక అయన మళ్ళీ ఆక్టివ్ అయి పవన్ మీద టీడీపీ మీద కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా చేసిన వాఖ్యలు టీడీపీ, జనసేన కు భయపడి చేసినట్లుగా అనుకోవచ్చని బాలాజీ తెలిపారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ వైసీపీ ప్రభుత్వం రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి అనే భయం వచ్చుండొచ్చు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…