Analyst Damu Balaji : వర్గ పోరు రాజకీయ ప్రత్యర్థుల కన్నా ఒకే కుటుంబంలోని వ్యక్తుల మధ్య రాజకీయ కుటుంబాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వర్గ పోరు ఫ్యాక్షన్ నేల అయిన సీమలో అందులోనూ ఆళ్లగడ్డ రాజకీయాల్లో నేడు చూస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరూ ఆకస్మికంగా వదిలి వెళ్లినా, కుటుంబ బాధ్యతలను వారి వారసత్వంగా అబ్బిన రాజకీయాలను చేస్తూ భూమా అఖిల ప్రియా రెడ్డి చిన్న వయసులోనే టీడీపీ తరుపున మంత్రి కూడా అయింది. అయితే తండ్రి భూమా నాగిరెడ్డి ఉన్నంత వరకు ఆయనకు రైట్ హ్యాండ్ గా నిలిచిన మామ ఏవి సుబ్బారెడ్డి తో ఇప్పుడు గొడవ పడుతోంది అఖిల ప్రియ. ఇక ఈ వర్గ పోరు ఎలా మొదలయింది వంటి అంశాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
లోకేష్ పాదయాత్రలో కొట్టుకున్న ఇరువర్గాలు…
భూమా కుటుంబం ఆళ్లగడ్డ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎపుడూ కలిసి ఉండే వాళ్ల మధ్య ఇపుడు వర్గ పోరు మొదలయింది. కొట్టుకునే వరకు వెళ్లిపోయారు. భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రాం ద్వారా సుపారీ ఇచ్చి మామ ఏవి సుబ్బారెడ్డి ని చంపించాలని ప్లాన్ కూడా చేసినట్లు తెలుస్తోంది అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. తండ్రి మరణించాకే వీరి మధ్య విబేధాలు వచ్చాయని తెలిపారు బాలాజీ. తాజాగా ఆళ్లగడ్డ వద్దకు లోకేష్ పాదయాత్ర చేరుకున్న సందర్బంగా 101 రోజు కావడంతో సంఘీభావంగా టీడీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీ లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
భూమా అఖిల ప్రియ ముందే అటు వర్గం మీద దాడులు నిర్వహించి బాగా కొట్టారు. ఆ కొట్టిన వీడియో బయటికి రావడంతో టీడీపీ పార్టీ ఈ విషయం మీద అచ్చంనాయుడు ఆధ్వర్యంలో కమిటీ కూడా వేసింది అంటూ బాలాజీ తెలిపారు. అయితే దగ్గరుండి అఖిల ప్రియ ఇలా చేయించిందనే ఆరోపణలు నడుమ నా చున్నీ లాగడంతో మా వాళ్ళు వారి మనిషి మీద దాడి చేసారంటూ అఖిల ప్రియ చెప్పుకొచ్చింది. అయితే వీడియోలో అవేవి లేవు, కేవలం వారిని అఖిలప్రియ తరుపు మనుషులు కొట్టడం మాత్రమే ఉంది అంటూ చెప్పారు బాలాజీ. ఇక లోకేష్ ముందు బల ప్రదర్శన కోసమే ఇలా గొడవ జరిగిందని తెలుస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…