Analyst Damu Balaji : వివేకానంద హత్య కేసు అనేక మలుపులు తిరిగి మళ్ళీ అవినాష్ రెడ్డి అరెస్టు దగ్గరే ఆగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానంద ను హత్య చేయించారని ఈ కేసులో మొదటి నుండి ఆయనను అరెస్టు చేయాలని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి కోరుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండగా తాజాగా సుప్రీం కోర్ట్ ను సునీత్ రెడ్డి ఆశ్రయించారు. అయితే తాజాగా సుప్రీం కోర్ట్ సునీత కు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోందని అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.
హై కోర్ట్ కి వెళ్లామన్న సుప్రీం కోర్ట్…
వివేకానంద హత్య తరువాత ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని సునీత కేసును సిబిఐ కి అప్పగించాలని కోరగా అలాగే ఏపీ హై కోర్ట్ నుండి కేసును తెలంగాణ హై కోర్ట్ కి కేసు బదిలీ చేయించుకున్న సునీత ప్రస్తుతం అక్కడ నుండి సుప్రీం తలుపు తట్టారు.
అయితే సుప్రీం కోర్ట్ కేసును ఆల్రెడీ హై కోర్ట్ చూస్తున్నదున కల్పించుకోమని చెప్పగా సునీత తరుపున లాయర్లు సుప్రీం కోర్ట్ విచారించాలని కోరారు. దీంతో తీర్పును నేటికి వాయిదా వేసింది సుప్రీం కోర్ట్. అయితే తాజాగా సుప్రీం కోర్ట్ లోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హై కోర్ట్ లోనే ఈ కేసును తేల్చుకోవాలని సునీత కి చెప్పినట్లు తెలుస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…