Categories: FeaturedGeneral News

Analyst Damu Balaji : సాఫ్ట్ వేర్ రాధ మర్డర్ కేసులో ట్విస్టు…. అసలు హంతకుడు అతనే….: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : భార్యభర్తల మధ్య వచ్చే చిన్న అనుమానాలే పెను భూతలై చివరకు క్రైమ్స్ కి దారితీస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన రాధ అనే మహిళకు మోహన్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో పెళ్లి జరిగింది. వారికి ఒక ఐదేళ్ళ బాబు కూడా ఉండగా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కాగా రాధాకి చిన్న తనం నుండి కాశీ రెడ్డి అనే వ్యక్తి మంచి స్నేహితుడు. అతని ఉద్యోగం పోవడం సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టుకోవడంతో అతను అప్పుగా డబ్బు అడగడంతో రాధ అతని భర్త ద్వారా 80 లక్షలు అప్పు ఇప్పించింది. అయితే డబ్బు ఇప్పటికీ తిరిగి ఇవ్వకపోవడంతో ఇప్పటికే పంచాయితీ జరుగగా తాజాగా రాధ హత్య జరగడంతో కాశి రెడ్డి మీద అనుమానం వచ్చి అతని కోసం గాలింపు జరుగగా అతను పరారిలో ఉన్నాడు. ఇక ఈ కేసు గురించి ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషించారు.

మోహన్ రెడ్డి అసలు హంతకుడు…..

అనలిస్ట్ దాము బాలాజీ ఈ కేసు గురించి మాట్లాడుతూ ఈ కేసును పోలీసులు ఒక రోజులోనే పురోగతి సాధించారు అంటూ తెలిపారు. ఈ కేసులో కోదాడకు చెందిన రాధ భర్త మోహనరెడ్డి అసలు నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు అంటూ దాము బాలాజీ తెలిపారు. మొదట కేసు కాశిరెడ్డి చుట్టూ తిరిగినా రాధా ఫోన్ కి కాశిరెడ్డి పేరుతో మెసేజెస్ పెట్టిన ఫోన్ నెంబర్ ఎక్కడి నుండి మెసేజెస్ పంపారో పోలీసులు ఆరా తీయగా హైదరాబాద్ లోని కొబ్బరి బొండాలు అమ్మే ఒక మహిళ ఫోన్ నుండి అని తెలిసింది. ఆమె దగ్గర కాశీ రెడ్డి అలాగే మోహన్ రెడ్డి ఫోటోలను చూపించి అడుగ్గా మోహన్ రెడ్డి తన వద్ద ఫోన్ తీసుకుని తిరిగి ఇచ్చేటపుడు సిమ్ తీసుకుని ఫోన్ ఇచ్చినట్లు చెప్పడంతో హత్య చేసింది మోహన్ రెడ్డి అని పోలీసులకు క్లారిటీ వచ్చిందంటూ చెప్పారు బాలాజీ.

ఇక రాధ ను మోహన్ రెడ్డి కాశిరెడ్డి పిలిచినట్లుగా ఒక ప్రదేశానికి పిలిపించి అక్కడే ఆమెను కొట్టి స్పృహ కోల్పోయాక కాళ్ళ మీద కారు ఎక్కించి ఆమెను సిగరెట్లతో కాల్చి ఆమె గుండె మీద కారు ఎక్కించి చివరగా బండ రాయితో ఆమె తల నుజ్జు చేసి చంపేశాడు. ఆమె మరణించాక కారును తోసేసి అక్కడి నుండి వచ్చేసాడు. కాశీ రెడ్డి ని డబ్బులదిగే విషయంలో కాశీ రెడ్డిని, రాధని ,మోహన్ రెడ్డి అనుమానించాడు. ఆ అనుమానం బలపడటంతో ఆమెను హత్య చేసి ఆ నేరం కాశీ రెడ్డి మీద వేసి ఉండవచ్చు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago