Analyst Damu Balaji : సరూర్ నగర్ లో మ్యాన్ హోల్ హత్యగా బాగా హాట్ టాపిక్ అయిన అప్సర అనే యువతి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి సూర్య వెంకట సాయి కృష్ణ పూజారి అంటూ ఇప్పటివరకు అనుకున్నారు. నిజానికి అతను గుడిలో అర్చకుడు కాదు. కేవలం గుడి మేనేజ్మెంట్ కి సంబందించిన పనులను చూసుకుంటూ తన స్వంతానికి పూజలు జరిపేవాడు అంటూ తాజాగా వినిపిస్తోంది. సాయికృష్ణ గురించి ఆసక్తికర విషయాలను మైసమ్మ గుడిలో అర్చకులుగా పనిచేస్తున్న వాళ్లు చెబుతున్నారు. ఇక ఆ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
సాయికృష్ణ పూజారి కాదు…
సాయికృష్ణ తొలుత వేరే దేవాలయాల్లో పనిచేస్తున్న సమయంలో అక్కడ డబ్బును తప్పు దారిపట్టించాడు అనే ఆరోపణలతో అక్కడి నుండి పంపించేసారని ఇక ఆ సమయంలోనే చిన్న గుడిగా ఉన్న మైసమ్మ గుడికి ఆలయ కమిటీ మెంబెర్ గా ఉంటూ అక్కడ గుడిలో అర్చకులను అలాగే సెక్యూరిటీ సిబ్బందిని మొదలుకొని అందరినీ సాయికృష్ణ నే నియమించి గుడి మేనేజ్మెంట్ చూసుకునేవాడని అనలిస్ట్ బాలాజీ తెలిపారు.
ఇక హత్య చేసిన తరువాత గుడి వెనుక మండల్ ఆఫీస్ స్థలంలో శవాన్ని మ్యాన్ హోల్ లో పడేయాలని అనుకున్నపుడు మొదట గుడి వాచ్ మెన్ ను పనిలో నుండి తీసేసాడు అంటూ బాలాజీ తెలిపారు. మొదటి నుండి ఈ కేసులో అర్చకుడిగా సాయికృష్ణ ని అందరూ భావించినా అతను అర్చకుడు కాదని గుడి కమిటీలో ఉంటూ అక్కడ నిత్యాన్నదానం వంటి పనులను చేయిస్తూ ఉంటాడని పేర్కొన్నారు. అతను గుడికి వచ్చే విరాళాలను సొంతానికి వాడుకొన్నాడనే ఆరోపణలు ఉన్నాయని బాలాజీ తెలిపారు.
వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు. అయితే దాన్ని ఎప్పుడు చేయాలి అన్నదానిపై చాలా మందిలో సందేహాలు ఉంటాయి.…
ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…
వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…
ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాచి…
తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేపిన అంశం కవిత వ్యాఖ్యలు. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయంగా మరో దశలోకి…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఓటములతో జట్టు…