Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలియక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్, ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా ఈ కేసులో జగన్, భారతి పేర్లు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
చార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు… నిజమేంటంటే…
వివేకానంద హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా కేసులో పురోగతి సాధించలేదు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎంత మందిని విచారించినా అసలు హంతకులు మాత్రం దొరకడం లేదు. తాజాగా ఈ కేసులో జగన్, భారతి ల పేర్లు ఛార్జ్ షీట్లో సిబిఐ వాళ్ళు నమోదు చేసారంటూ టీడీపీ తరుపు మీడియాలో ప్రచారం జరుగుతోందని బాలాజీ తెలిపారు.
మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ కల్లం రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో జగన్ కి భారతి వచ్చి వివేకానంద హత్య గురించి తెలిపిందని చెప్పడంతో జగన్ అలాగే భారతి రెడ్డి లకు వివేకానంద హత్య జరిగినట్లు ఉదయం ఆరు గంటలకు ముందే తెలుసని, అందుకే వారినీ విచారించాలంటూ సిబిఐ భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నా వాటికి ఆధారాలు లేవని బాలాజీ తెలిపారు. నిజానికి టీడీపీ హయాంలోనే వివేకానంద హత్య జరిగింది. ఆ మూడు నెలలు వాళ్లెందుకు కాలయాపన చేసినట్లు, అపుడే విచారణ వేగవంతం చేసి ఉండొచ్చు కదా అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. వివేకానంద కేసులో అసలు దొషులు ఎప్పటికీ బయటికి రారు. న్యాయం జరగాలని కూడా ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ అనుకోవడం లేదు, కేవలం రెండు పార్టీలు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…